Wife Protest: రెండో పెళ్లికి సిద్ధమైన సాఫ్ట్వేర్ భర్త.. తల్లితో కలిసి న్యాయ పోరాటం చేస్తున్న భార్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Protest: ప్రస్తుత కాలంలో పెళ్లి అంటేనే చాలామంది భయపడే పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య సమస్యలు, మర్డర్లు వాటిని చూసి ప్రజలు బయపడుతున్నారు. మరికొందరైతే, ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్న తరువాత వారి బంధాన్ని వదిలించుకునేందుకు చేసే వ్యవహారాలు చూస్తుంటే అసలు ఎలా ఇలా పాల్పడుతున్నారు అంటూ మండిపడుతున్నారు ప్రజలు. ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్న తరువాత భార్యను వదిలించుకునేందుకు వివిధ మార్గాలను చేస్తుండడంతో.. వారిలో కొందరు తమ గౌరవాన్ని, హక్కులను కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘట్టం తాజాగా హైదరాబాద్ శివార్లలోని షాకోట్ హిమగిరి కాలనీలో వెలుగుచూసింది.
Read Also: CM Revanth Reddy: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీధర్ కుమార్ అనే వ్యక్తి తన భార్య స్రవంతిని వదిలేసి రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఈ విషయం తెలిసిన భార్య స్రవంతి, తన తల్లితో కలిసి భర్త ఇంటి ముందు ప్లేకార్డులు పట్టుకొని పోరాటం చేస్తుంది. నీవు అంటే నాకు ఇష్టం.. నీవే నా సర్వస్వం.. నీవు లేకుండా బ్రతకలేను.. అంటూ వెంట పడడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీధర్ కుమార్ ను తనను ప్రేమిస్తున్నాడని నమ్మిన స్రవంతి, తన తల్లిదండ్రులను ఎదురించి అతనితో వివాహం చేసుకుంది. అయితే, వివాహం జరిగిన నాలుగు నెలల నుంచే శ్రీధర్ అసలు రంగు బయటపెట్టాడు. ఆమెకు భౌతిక, మానసిక పరిస్థుతలకు ఇబ్బందులు కలిగిస్తూ.. పిల్లలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో తరచూ టాబ్లెట్లు ఇచ్చేవాడని ఆమె ఆరోపించింది. చివరికి మోజు తీరిన తరువాత.. నీతో అవసరం లేదు.. నా ఇంట్లో నుండి వెళ్లిపో.. నేను వేరే అమ్మాయితో వివాహం చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇలాంటి వేధింపులకు తాళలేక స్రవంతి భర్త ఇంటి ముందు మౌన నిరసన ప్రారంభించింది. నాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడినుంచి కదిలేది లేదు అంటూ భీష్మించి కూర్చుని తనకి న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది. ఆమెకు తోడుగా తల్లి కూడా ఈ నిరసనలో పాల్గొంటోంది. చూడాలిమరి ఈ సమస్యను ఎలా ముగిస్తారో.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!