Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు ఒకేసారి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. దోమలగూడ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్కు చెందిన వలస కార్మిక కుటుంబాలు దోమలగూడలోని ఫరీద్ బస్తీలో నివాసం ఉంటున్నాయి. అదే ప్రాంతానికి చెందిన సహిత కుమారి, స్నేహ కుమారి, లత అనే ముగ్గురు మైనర్ బాలికలు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు దోమలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి బాలికలు వెళ్లిన మార్గాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. విచారణలో బాలికలు మొదట హిమాయత్నగర్లో ఓ ఆటో ఎక్కినట్లు గుర్తించారు. ఆ తర్వాత వారు కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బాలికలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రెండు రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలిస్తూ వారి కదలికలను ట్రాక్ చేస్తున్నారు.
బాలికలు తమ స్వగ్రామమైన ఛత్తీస్గఢ్కు వెళ్లి ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేపట్టారు. రైల్వే అధికారులు, ఇతర జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. మరోవైపు ముగ్గురు బాలికల ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బాలికలను వీలైనంత త్వరగా గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
-
Harry Brook: వరల్డ్ నంబర్వన్ భారత్పై రెండు సిరీస్లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
-
Honor X7e Plus 5G: హానర్ X7e ప్లస్ 5G రిలీజ్.. 8100mAh బ్యాటరీ, Snapdragon 4 Gen 4 చిప్, 50MP కెమెరా
-
Jantar Mantar Protest: జంతర్మంతర్లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
-
Vande Mataram Bill 2026: ‘వందేమాతరం’పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!