Pub Drug Raid: హైదరాబాద్ నగరంలోని ఐటీ హబ్ గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేపాయి. కొండాపూర్ లోని ప్రముఖ పబ్ ‘క్వాక్ ఎరీనా’ (Quack Arena) పై ఏసీబీ ఈగల్ టీం శనివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించింది. వీకెండ్ కావడంతో పబ్ నిర్వాహకులు ‘డిజే బ్లాక్ కాఫీ’ పేరిట భారీ ఈవెంట్ను నిర్వహించగా, అక్కడ డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఈ రైడ్స్ చేపట్టారు.
కొండాపూర్ లోని క్వాక్ ఎరీనా పబ్ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. కేవలం రెండు నెలల క్రితమే ఇక్కడ నిర్వహించిన మరో భారీ పార్టీపై ఈగల్ టీం దాడులు చేసింది. ఆ సమయంలో ఏకంగా 15 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు మళ్ళీ అదే పబ్ లో డ్రగ్స్ దందా బయటపడడం గమనార్హం.
Kitchen Tips: మాడిన గిన్నెలను నిమిషాల్లో కొత్త దానిలా మెరిపించే సింపుల్ చిట్కాలు ఇవే!
నిన్న రాత్రి జరిగిన ఈవెంట్ కోసం నిర్వాహకులు ఆన్లైన్ లో భారీగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. భారీ ఎత్తున యువతీ యువకులు హాజరైన ఈ వేడుకలో డ్రగ్స్ వినియోగం జరుగుతోందని ఈగల్ టీం పక్కా సమాచారంతో రంగంలోకి దిగింది. ఈ దాడులలో ఈగల్ టీం తమ వెంట తెచ్చుకున్న ప్రత్యేక ఎక్విప్మెంట్స్ ద్వారా పబ్ లో ఉన్న వారికి అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఎనిమిది మంది డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. వీరిని వెంటనే అదుపులోకి తీసుకున్న అధికారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ఈ ఘటనతో పబ్ యాజమాన్యానికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరు పబ్ లోపలే డ్రగ్స్ సరఫరా చేశారా లేక నిందితులు బయట నుంచి తెచ్చుకున్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దాడుల సమయంలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా అదే పబ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. “నేను ఈ రోజు క్వాక్ ఎరీనా పబ్ కి వెళ్ళాను. పోలీసులు అక్కడ నాకు యూరిన్ టెస్ట్ నిర్వహించారు. ఫలితాల్లో నెగిటివ్ వచ్చింది. హేమ ఎప్పుడూ తప్పు చేయదు, జెన్యూన్ గా ఉంటుంది” అని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈవెంట్ లో పాల్గొన్నప్పటికీ తనకు డ్రగ్స్ తో సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.
Gold Man: ఈసారి నిజమైన బంగారం.. మరో ‘గోల్డ్ మాన్’.. రూ.1 కోటి విలువైన బంగారం స్వాధీనం..!
వరుసగా రెండోసారి ఒకే పబ్ లో డ్రగ్స్ కేసులు బయటపడడంతో పోలీసులు క్వాక్ ఎరీనా పబ్ లైసెన్స్ రద్దు చేసే దిశగా ఆలోచిస్తున్నారు అధికారులు. పట్టుబడిన ఎనిమిది మంది యువకులు ఎక్కడి నుండి వచ్చారు? వారికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు? అనే అంశాలపై గచ్చిబౌలి పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఐటీ కారిడార్ లో పబ్ లపై నిఘా మరింత పెంచుతామని అధికారులు హెచ్చరించారు.