Hyderabad Police: మందు తాగితే అంతే సంగతులు.. ఇక చర్లపల్లి జైలుకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Police Warning: ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా ఎంత అవగాహన కార్యక్రమాలు చేపట్టిన వాహనదారులు మాత్రం రోడ్డు నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా వారి ప్రాణాలను రిస్కులో పెట్టుకోవడమే కాదు ఇక అభం శుభం తెలియని అమాయకుల ప్రాణాలను కూడా తీసేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూనే ఉన్నాయ్. ముఖ్యంగా మద్యం తాగి వాహనం నడిపితే ఊరుకునే ప్రసక్తేలేదని జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఎంతోమంది వాహనదారుల తీరులో మార్పు రావడం లేదు.
ఫుల్లుగా మద్యం తాగడం ఇక ఆ తర్వాత వాహనం నడపడం ఆపై ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్ చేసి ఇక తమ ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా ఇతరుల ప్రాణాలు తీయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనల కారణంగా ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోతుంది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నప్పటికీ మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వారి సంఖ్య మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. ఒకరకంగా నేటి రోజుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడపడం కారణంగానే అని చెప్పాలి. అయితే మందుబాబులకు బ్రేకులు వేసేందుకు మరో రూల్ తీసుకురానున్నారు పోలీసులు. ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే జరిమానా, కనిష్టంగా జైలుశిక్ష విధిస్తుండే వారు. కానీ ఇకపై నుంచి పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే.. నేరుగా చర్లపల్లి జైలుకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు కారణం అక్కడ పారిశ్రామిక యూనిట్ ఉండటం. జైలులో పని చేయించడంతో ఉత్పత్తికి తోడు వారిలో మార్పు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
Also Read
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
Read Also: Wedding Kit: వెడ్డింగ్ కిట్లో కండోమ్లు, బర్త్ కంట్రోల్ పిల్స్.. ప్రభుత్వ కొత్త పథకం!
ఇంతవరకు డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే ఏదో జరిమానా కట్టి బయటకు వచ్చేస్తాం లే అనుకునే వాళ్లు మందుబాబులు. కానీ ఈ రూల్ను తీసుకొస్తే అలా ఉండదు. సచ్చినట్టు జైలుకు వెళ్లాల్సిందే. అలా చేయడం ద్వారా ప్రమాదాల నివారణ అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇంకేముంది మరీ మద్యం తాగి రోడ్డెక్కుతారా.. లేదా తాగి కామ్గా ఇంట్లోనే ఉంటారా అనేది మందుబాబులు ఆలోచించుకోవాలి. ఏమవుతుందిలే అని రోడ్డెక్కారా.. పోయి జైలు ఊసలు లెక్కపెట్టాల్సిందే. సో బీ కేర్ ఫుల్ మందుబాబులు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు అందరూ.
తాజావార్తలు
-
Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
-
Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!