Hyderabad : ఇక నో టెన్షన్.. ప్రతి జోన్లో ఒక్కో సైబర్ సెల్ పోలీస్ స్టేషన్..!
- జీఓ 50ద్వారా జోనల్ సైబర్ సెల్స్ (ZCC) ఏర్పాటు చేశాం..
- హైదరాబాద్ మహానగరంలో ఒక్క సైబర్ క్రైమ్ స్టేషన్ మాత్రమే ఉంది..
- సైబర్ క్రైమ్ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు..
- ప్రతి పిటిషన్ ని దర్యాప్తు చేయడానికే ZCC సిస్టమ్ ఏర్పాటు చేశాం..
- హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం
హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. నిన్నటి వరకు కమిషనరేట్ కు ఒకే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండేది. నేటి నుంచి జోన్ ల వారికి అమలు లోకి రానున్నాయి. సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో జోనల్ సైబర్ సెల్స్ అమలులోకి వచ్చాయి. ఇక పై ప్రతి జోన్ లో ఒక్కో సైబర్ సెల్ స్టేషన్ ఉంటుంది. కాగా.. గడిచిన 9 సంవత్సరాల్లో సైబర్ నేరాలు 786 % శాతం పెరిగాయి. 2016 లో 267 సైబర్ క్రైమ్ కేస్ లు ఉంటే 2024 లో 3111 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తర్వాత ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో 7 జోనల్ సైబర్ సెల్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. 7 సైబర్ సెల్ లో 61 సిబ్బంది నియమించారు. జోన్ డీసీపీ కిందనే సైబర్ సెల్స్ టాస్క్ ఫోర్స్ పని చేస్తుంది.
READ MORE: Pahalgam Terror Attack: భారత వ్యతిరేక ర్యాలీలో పహల్గామ్ సూత్రధారి.. వీడియో వైరల్..
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ ప్రసంగించారు. “జీఓ 50ద్వారా జోనల్ సైబర్ సెల్స్ (ZCC) ఏర్పాటు చేశాం. హైదరాబాద్ మహానగరంలో ఒక్క సైబర్ క్రైమ్ స్టేషన్ మాత్రమే ఉంది.. సైబర్ క్రైమ్ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు.. ప్రతి పిటిషన్ ని దర్యాప్తు చేయడానికే ZCC సిస్టమ్ ఏర్పాటు చేశాం.. 2015లో 351కేసులు నమోదు అయ్యాయి.. గత సంవత్సరం 3111 కేసులు నమోదు అయ్యాయి.. 35రకాల కేసులు నమోదు అవుతున్నాయి.. వాటిన్నింటిని గుర్తించాం.. సోషల్ మీడియా కేసులు ఎక్కువయ్యాయి.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 7జోన్స్ లాల్లో ZCC ని తీసుకొచ్చాం.. ZCC పని తీరు, పని భారాన్ని బట్టి సైబర్ క్రైమ్ స్టేషన్స్ త్వరలో ఏర్పాటు అవుతాయి.. ప్రతి స్టేషన్ లో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయడం వీలుకాదు.. డీసీపీ కార్యాలయాల్లో జోనల్ డీసీపీ పర్యవేక్షణలో ఇవి నడుస్తాయి.. ప్రతి జోన్లు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసాం.. ZCC కోసం ఒక్క ఎస్సై, 5గురు కానిస్టేబుల్స్, ఇద్దరు హోం గర్డ్స్ ఉంటారు.. ZCC లోనే వృత్తిరీత్య అంత టెక్నికల్ పరిజ్ఞానం పొందిన తర్వాతే సిబ్బందిని కేటాయించాము.. ZCC లో 25వేల కన్నా ఎక్కువ లక్ష వరకు దర్యాప్తు చేయనున్నారు.. 25వేల కాంటే తక్కువ ఉంటే లీగల్ ప్రోసెస్ ప్రకారం వెళ్తారు..” అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!