Hyderabad : ఇక నో టెన్షన్.. ప్రతి జోన్లో ఒక్కో సైబర్ సెల్ పోలీస్ స్టేషన్..!
- జీఓ 50ద్వారా జోనల్ సైబర్ సెల్స్ (ZCC) ఏర్పాటు చేశాం..
- హైదరాబాద్ మహానగరంలో ఒక్క సైబర్ క్రైమ్ స్టేషన్ మాత్రమే ఉంది..
- సైబర్ క్రైమ్ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు..
- ప్రతి పిటిషన్ ని దర్యాప్తు చేయడానికే ZCC సిస్టమ్ ఏర్పాటు చేశాం..
- హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. నిన్నటి వరకు కమిషనరేట్ కు ఒకే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండేది. నేటి నుంచి జోన్ ల వారికి అమలు లోకి రానున్నాయి. సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో జోనల్ సైబర్ సెల్స్ అమలులోకి వచ్చాయి. ఇక పై ప్రతి జోన్ లో ఒక్కో సైబర్ సెల్ స్టేషన్ ఉంటుంది. కాగా.. గడిచిన 9 సంవత్సరాల్లో సైబర్ నేరాలు 786 % శాతం పెరిగాయి. 2016 లో 267 సైబర్ క్రైమ్ కేస్ లు ఉంటే 2024 లో 3111 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తర్వాత ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో 7 జోనల్ సైబర్ సెల్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. 7 సైబర్ సెల్ లో 61 సిబ్బంది నియమించారు. జోన్ డీసీపీ కిందనే సైబర్ సెల్స్ టాస్క్ ఫోర్స్ పని చేస్తుంది.
READ MORE: Pahalgam Terror Attack: భారత వ్యతిరేక ర్యాలీలో పహల్గామ్ సూత్రధారి.. వీడియో వైరల్..
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ ప్రసంగించారు. “జీఓ 50ద్వారా జోనల్ సైబర్ సెల్స్ (ZCC) ఏర్పాటు చేశాం. హైదరాబాద్ మహానగరంలో ఒక్క సైబర్ క్రైమ్ స్టేషన్ మాత్రమే ఉంది.. సైబర్ క్రైమ్ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు.. ప్రతి పిటిషన్ ని దర్యాప్తు చేయడానికే ZCC సిస్టమ్ ఏర్పాటు చేశాం.. 2015లో 351కేసులు నమోదు అయ్యాయి.. గత సంవత్సరం 3111 కేసులు నమోదు అయ్యాయి.. 35రకాల కేసులు నమోదు అవుతున్నాయి.. వాటిన్నింటిని గుర్తించాం.. సోషల్ మీడియా కేసులు ఎక్కువయ్యాయి.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 7జోన్స్ లాల్లో ZCC ని తీసుకొచ్చాం.. ZCC పని తీరు, పని భారాన్ని బట్టి సైబర్ క్రైమ్ స్టేషన్స్ త్వరలో ఏర్పాటు అవుతాయి.. ప్రతి స్టేషన్ లో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయడం వీలుకాదు.. డీసీపీ కార్యాలయాల్లో జోనల్ డీసీపీ పర్యవేక్షణలో ఇవి నడుస్తాయి.. ప్రతి జోన్లు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసాం.. ZCC కోసం ఒక్క ఎస్సై, 5గురు కానిస్టేబుల్స్, ఇద్దరు హోం గర్డ్స్ ఉంటారు.. ZCC లోనే వృత్తిరీత్య అంత టెక్నికల్ పరిజ్ఞానం పొందిన తర్వాతే సిబ్బందిని కేటాయించాము.. ZCC లో 25వేల కన్నా ఎక్కువ లక్ష వరకు దర్యాప్తు చేయనున్నారు.. 25వేల కాంటే తక్కువ ఉంటే లీగల్ ప్రోసెస్ ప్రకారం వెళ్తారు..” అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!