MP Asaduddin Owaisi : దీనివల్ల బాబ్రీ మసీదు కేసు పునరావృతం కావచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో జ్ఞాన్వాపి కేసు సంచలన సృష్టిస్తున్న విషయం తెలసిందే. అయితే.. వారణాసి కోర్టుల జ్ఞానవాపి కేసులో హిందువులు సమర్పించిన పిటిషన్పై విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. జ్ఞాన్వాపి కేసులో వారణాసి జిల్లా కోర్టుల ఉత్తర్వు అంతులేని వ్యాజ్యానికి తెరుస్తుందని, దీనివల్ల బాబ్రీ మసీదు కేసు పునరావృతం కావచ్చని, దేశాన్ని మరోసారి 1980-1990 లకు నెట్టివేస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కోర్టు ఉత్తర్వులు దాని ఫలితంగా వచ్చే శాశ్వత వ్యాజ్యాలు దేశంపై అస్థిరపరిచే ప్రభావాన్ని చూపుతాయన్నారు. బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మరిన్ని సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు అసదుద్దీన్. జ్ఞాన్వాపి కేసు ఉత్తర్వుతో, 1991 ప్రార్థనా స్థలాల చట్టం ఉద్దేశ్యం విఫలమవుతుందని పేర్కొంటూ ఇప్పుడు అందరూ కోర్టుకు వెళ్తారని అని ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ ఆర్డర్ దేశంలో అనేక కొత్త వివాదాలకు దారితీస్తుందని నేను నమ్ముతున్నాను. 1947 ఆగస్టు 15కి ముందు మరో మతానికి చెందిన ప్రార్థనా స్థలంలో మేము దీన్ని (ఆచారం) చేస్తున్నామని అందరూ చెబుతారు, ”అని ఆయన అన్నారు.
Also Read
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
- Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
“1991 చట్టం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని బాబ్రీ మసీదు తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పుడు అటువంటి ఉత్తర్వు ఎలా జారీ చేయబడుతుంది?” 1991 చట్టం ఆగస్టు 15, 1947న ఉన్న అన్ని ప్రార్థనా స్థలాల మతపరమైన స్వభావాన్ని ముద్రిస్తుంది. ఇది ప్రార్థనా స్థలం యొక్క మతపరమైన స్వభావాన్ని మార్చడాన్ని నిషేధిస్తుంది. చట్టం ప్రకారం, ఆగష్టు 15, 1947న ఉన్న ప్రార్థనా స్థలం యొక్క మతపరమైన స్వభావం ఆ రోజున అలాగే కొనసాగుతుంది. “అలాంటి వివాదాలు శాశ్వతంగా ముగిసేలా చట్టం చేయబడింది, అయితే ఈ (జ్ఞానవాపి కేసు) ఉత్తర్వు తర్వాత ఈ విషయాలన్నింటిపై వ్యాజ్యం ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. గత వివాదాలకు స్వస్తి చెప్పడమే లక్ష్యం. ఇప్పుడు ఈ శాశ్వత వ్యాజ్యం కొనసాగుతుంది. ఒక వ్యాజ్యాన్ని కొనసాగించడానికి అనుమతించడం ద్వారా బాబ్రీ మసీదు పునరావృతమవుతుంది”అని ఆయన అన్నారు. “ఇప్పుడు జ్ఞాన్వాపి కేసులో కోర్టు తీర్పు తర్వాత, రేపు ఎవరైనా వెళ్లి మనం ప్రార్థనా స్థలంలో అలాంటి పని చేస్తున్నామని లేదా మేము దానిని స్వాధీనం చేసుకున్నామని చెప్పవచ్చు. ఇదే జరిగితే దీనికి అంతం ఉండదు’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
-
Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
-
Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
-
CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
-
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!