Lovers Suicide: “నువ్వు లేని లోకంలో నేను ఉండలేను బంగారం”.. ప్రేమ జంట ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lovers Suicide: ఇద్దరూ ప్రేమించుకున్నారు…!! చదువు పూర్తయ్యాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు !! ఇంతలోనే ప్రియురాలు హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రియుడు కూడా మంచిర్యాలలో ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను బంగారం అంటూ… సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు. తెలిసీ తెలియని వయసులో పుట్టిన ప్రేమ… ఇద్దరినీ బలికోరింది. ఇంతకు ఆ యువతి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టు !! ఇద్దరి ఆత్మహత్య వెనకా దాగున్న మిస్టరీ ఏంటి..?
READ MORE: Whatsapp Group: దొంగను పట్టించిన వాట్సప్ గ్రూప్.. వాట్సపా మజాకా..
Also Read
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
హైదరాబాద్… బీబీనగర్-ఘట్కేసర్ రైల్వే ట్రాక్పై ఓ యువతి ట్రైన్కి ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన లోకో పైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. యువతి బ్యాగ్లో దొరికిన ఐడీ కార్డ్ ఆధారంగా వివరాలు సేకరించారు. యువతి ఘట్ కేసర్ పరిధిలోని విజ్ఞాన్ కాలేజ్లో ఇంజినీరింగ్ చదువుతున్న దుంపటి హిత వర్షిణిగా గుర్తించారు. పేరెంట్స్కి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతి సొంతూరు మంచిర్యాల జిల్లా.. దండేపల్లి మండలం రాజంపేట. హిత వర్షిణి సొంతూరైన రాజంపేటలో వినయ్ అనే యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వినయ్ రాసిన సూసైడ్ లెటర్తో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న హిత వర్షిణితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నానని.. తన ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడం తట్టుకోలేకే తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు 3 పేజీల సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. దాన్ని స్వాధీనం చేసుకున్నారు మంచిర్యాల పోలీసులు..
READ MORE: Siachen Tragedy: సియాచిన్లో విషాదం.. ఆర్మీ అధికారులను బలిగొన్న మంచు
లక్షెట్టిపేట మండలం కొమ్ముగూడెం పంటపొలాల్లో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు వినయ్. సూసైడ్ లెటర్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని… పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ఏరియా హాస్పిటల్కి తరలించారు పోలీసులు. తాను ప్రేమించిన హిత వర్షిణి లేని లోకంలో తాను ఉండలేనని… పైలోకంలో హిత వర్షిణి ఒంటరిగా ఉండలేదని, అందుకే తానూ ఆత్మహత్య చేసుకుని హిత వర్షిణి దగ్గరికి వెళ్తున్నాను అంటూ లెటర్లో రాశాడు వినయ్. ఎప్పటికీ తోడుగా ఉంటానని హిత వర్షిణికి మాటిచ్చానని.. అందుకే చావులోనూ తోడుగా వెళ్తున్నాను అంటూ తన ప్రేమను వ్యక్తపరుస్తూ 3 పేజీల నోట్ రాశాడు. కేసు నమోదు చేసుకున్న మంచిర్యాల పోలీసులు, సికింద్రాబాద్ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వర్షిణి కాల్ డేటాను పరిశీలించగా.. ఆత్మహత్యకు ముందు చివరగా వినయ్తోనే మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. ఐతే… వర్షిణి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? అనే కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారా..? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అని పోలీసులు విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!