హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కు సర్వం సిద్ధమైంది. రేపు జీహెచ్ఎంసీలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. రేపు జరిగే ఎన్నికకు ఏప్రిల్ 25న కౌంటింగ్ చేసి ఫలితాల ప్రకటిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్, కౌoటింగ్ కు ఏర్పాట్లు చేశారు. రేపటి ఎన్నికకు ఎక్స్ అఫిషియో సభ్యులు, కార్పొరేటర్లకు రెండు వేరువేరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంఐఎం, బీజేపీ పార్టీల మధ్య జరగనున్న ఎమ్మెల్సీ పోటీ జరగనుంది.. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలోకి దిగనున్నారు.. ఎన్నికలో మొత్తం ఓటర్లు సంఖ్య 112.. అందులో కార్పొరేటర్ల సంఖ్య 81.. ఎక్స్ ఆఫీషియో సభ్యుల సంఖ్య 31 ఉంది..
READ MORE: Priyadarshi: నా జాతకం చూపిస్తే నటుడే అవ్వలేవన్నారు.. ఫోటో దిగితే చాలనుకున్న ఆయనే డైరెక్ట్ చేశారు !
పార్టీల వారిగా బలాబలాలు చూస్తే.. ఎంఐఎంకు 41 కార్పొరేటర్లు, 9 ఎక్స్ ఆఫీషియో సభ్యులు మొత్తం 50 మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీకి 18 కార్పొరేటర్లు, 6 ఎక్స్ ఆఫీషియో సభ్యులు మొత్తం 24 మంది ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ కు ఏడుగురు కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ ఆఫీషియో సభ్యులు మొత్తం 14 మంది ఉండగా.. బీఆర్ఎస్కు15 కార్పొరేటర్లు, 9 ఎక్స్ ఆఫీషియో సభ్యులు మొత్తం 24 మంది ఓటర్లు ఉన్నారు. సరిపడ సంఖ్య బలం లేకున్నా తొలి సారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచింది బీజేపీ.. 22 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరగనుంది..