Tamil Nadu: తమిళనాడులో దారుణం.. భర్త ప్రాణాలు తీసిన భార్య సీరియల్ పిచ్చి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Lost His Life due to Wife’s Serial Madness: ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళలు తమ అభిమాన సీరియల్ వస్తుందంటే చాలు.. అన్ని పనులు పక్కనపెట్టి టీవీలకు అతుక్కుపోతుంటారు. సీరియల్ వస్తున్న సమయంలో పక్కన ప్రపంచాన్ని అస్సలు పట్టించుకోరు. భర్త, పిల్లలు ఛానెల్ మార్చమన్నా.. కొందరు ససేమిరా అంటారు. ఈ సీరియల్ పిచ్చి వలన భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ భర్త ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. భార్య సీరియల్ పిచ్చితో ఓ భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాలు ప్రకారం… తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులో భార్యాభర్తలు నిషా, ఆశీర్వాదం నివాసం ఉంటున్నారు. ఆశీర్వాదం ఆఫిస్ నుంటి ఇంటికి వచ్చే సరికి భార్య నిషా తనకు ఇష్టమైన సీరియల్ చూస్తోంది. ఛానల్ మార్చాలంటూ భార్య నిషాను ఆశీర్వాదం కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దాంతో ఆశీర్వాదంకు చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
Also Read
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
- New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
ఛానల్ మార్చాలంటూ ఆశీర్వాదం పట్టుపట్టాడు. దాంతో చిన్న గొడవ కాస్త తీవ్ర స్ధాయికి చేరింది. నిషా కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అదే కోపంతో ఆశీర్వాదం కూడా ఇంటి నుండి బయటికి వెళ్లాడు. నిషా తిరిగి ఉదయం ఇంటికి రాగానే ఆశీర్వాదం ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భార్య నిషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!