Defense Budget: రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు..
- 2024-25 సంవత్సరానికి సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి
- రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు
- రక్షణ మంత్రిత్వ శాఖకు పౌర ఖర్చుల కోసం రూ.25 963.18 కోట్లు
- రక్షణ సేవలకు రూ.2 82 772.6 కోట్లు
- బీఆర్వో.. డీఆర్డీవోకు మరింత ప్రోత్సాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డీఏ ప్రవేశపెట్టిన తొలిబడ్జెట్ ఇది. బడ్జెట్లో ఉద్యోగస్తులకు ఆదాయపు పన్ను రాయితీ ఇవ్వడంతో పాటు రక్షణ రంగంపై కూడా ఆర్థిక మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. చైనా, పాకిస్థాన్ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ తన సైన్యాన్ని ఆధునీకరించే పనిలో నిమగ్నమై ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా మిలటరీ బడ్జెట్ బాగా పెరిగింది.
READ MORE: PM Modi: ఈ బడ్జెట్ అన్ని వర్గాలది.. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడమే లక్ష్యం..
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ప్రస్తుతం భారత సైన్యం తన ఆయుధాలను అప్గ్రేడ్ చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఇందుకోసం రష్యాతో ఎస్-400 యాంటీ మిస్సైల్ సిస్టమ్కు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవస్థ సరఫరా కూడా ప్రారంభమైంది. అదేవిధంగా, రాఫెల్ యుద్ధ విమానం తర్వాత, భారతదేశం ఫ్రాన్స్ నుంచి అణు జలాంతర్గామిని కొనుగోలు చేస్తోంది. దీనితో పాటు.. భారతదేశం స్వయంగా తేజస్ వంటి స్వదేశీ యుద్ధ విమానాలను అభివృద్ధి చేస్తోంది. సైన్యం ఆధునికీకరణకు సంబంధించిన ఈ ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. అటువంటి పరిస్థితిలో, ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్లో రక్షణ రంగానికి ఐదు శాతం కేటాయింపులను పెంచారు.
READ MORE:CM Chandrababu: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. మరో రెండు నెలల తర్వాత ఏపీ బడ్జెట్!
ఈసారి రక్షణ మంత్రిత్వ శాఖకు పౌర ఖర్చుల కోసం రూ.25,963.18 కోట్లు, రక్షణ సేవలకు రూ.2,82,772.6 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో రక్షణ రంగంలో మూలధన వ్యయానికి రూ.1,72,000 కోట్లు, పెన్షన్కు రూ.1,41,205 కోట్లు ప్రకటించారు. ఈ విధంగా మొత్తం రక్షణ బడ్జెట్ రూ.6,21,940 కోట్లకు పెరిగింది. ఈ మొత్తం గతసారి కంటే దాదాపు రూ.28 వేల కోట్లు ఎక్కువ. 2023-24 పూర్తి బడ్జెట్లో రక్షణ రంగానికి సంబంధించిన ఖర్చును మోడీ ప్రభుత్వం రూ.5,93,537 కోట్లకు పెంచింది. ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఈ కేటాయింపు 13.18 శాతం. గత పూర్తి బడ్జెట్లో నాన్ శాలరీ-ఆపరేషన్ సంబంధిత అంశాలకు రూ.27,570 కోట్లు కేటాయింపులు పెంచారు. ఈ విధంగా ఈ అంశం కింద మొత్తం కేటాయింపు రూ.90 వేల కోట్లకు పెరిగింది.
READ MORE: Harish Rao: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు..
బీఆర్వో, డీఆర్డీవోకు మరింత ప్రోత్సాహం..
చైనా సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ కారణంగా, గత బడ్జెట్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) బడ్జెట్ను 43 శాతం పెంచారు. దీనితో పాటు, DRDO బడ్జెట్ కూడా తొమ్మిది శాతం పెరిగింది. స్వదేశీ ఆయుధాల అభివృద్ధిలో ఈ సంస్థ ముఖ్యపాత్ర పోషిస్తున్నందున ఈసారి DRDOకి ఎక్కువ డబ్బు ఇచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!