Kaleshwaram Project: గత ప్రభుత్వ జీవో రద్దు చేయకున్నా.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు, ఎలాగంటే?
- కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం
- జీవో రద్దు చేయకున్నా సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు
- రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి కేసు అప్పగించాలంటే?
బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో తెలంగాణ రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశంకు అనుమతి తప్పనిసరి అని జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సాధారణ సమ్మతి (General Consent)ని రద్దు చేసింది. అంటే.. సీబీఐకి దర్యాప్తు కోసం రాష్ట్రంలో ప్రవేశించేందుకు ప్రతి కేసులో ప్రత్యేక అనుమతి అవసరం. ఈ నిర్ణయం జీవో ఎంఎస్ నెం.51 ద్వారా 30 ఆగస్టు 2022న జారీ చేయబడింది. ఈ జీవో ప్రకారం.. గతంలో ఇచ్చిన సాధారణ అనుమతులు అన్నీ రద్దు చేయబడ్డాయి. ఈ నిర్ణయం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946 (DSPE Act) సెక్షన్ 6 ప్రకారం తీసుకోబడినది. ఈ జీవోను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయకున్నా.. సీబీఐకి అనుమతిస్తూ కాళేశ్వరం కేసు అప్పగించాల్సి ఉంటుంది.
సీబీఐకి రాష్ట్రంలో విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని కేసును సీబీఐకి సాధారణ సమ్మతి లేదా ప్రత్యేక సమ్మతి ఇచ్చి అప్పగించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి సాధారణ సమ్మతి ఇచ్చినప్పుడు సీబీఐకి ఆ రాష్ట్రంలో ఎప్పుడైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి అనుమతి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) గతంలో సాధారణ సమ్మతి ఉపసంహరించుకున్నాయి. తెలంగాణ సీబీఐకి అనుమతిపై బీఆర్ఎస్ ఇచ్చిన జీవో రద్దు చేయాలి. ప్రత్యేక సమ్మతి విషయంలో.. ఒక ప్రత్యేక కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఆదేశం ద్వారా సీబీఐకి అప్పగిస్తుంది. దీనికి గజిట్ నోటిఫికేషన్ లేదా అధికారిక ఆదేశం జారీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. అనంతరం సీబీఐ కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేపడుతుంది.
Also Read
Also Read: Bandi Sanjay: ప్రభుత్వం సత్యానికి తలవంచింది.. బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్!
రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి కేసు అప్పగించాలంటే:
1. కేబినెట్/హోం డిపార్ట్మెంట్ ఆమోదం తీసుకోవాలి
2. ప్రత్యేక సమ్మతి ఆర్డర్ ఇవ్వాలి
3. కేంద్రానికి పంపి ఆమోదం పొందాలి
4. ఆ తరువాతే సీబీఐకి అధికారికంగా కేసు రిజిస్టర్ చేసి విచారణ మొదలు పెడుతుంది
1. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం (కేబినెట్ / హోం శాఖ ఆమోదం)
2. ప్రత్యేక సమ్మతి ఆర్డర్ జారీ
3. కేంద్రానికి (DoPT) పంపడం
4. కేంద్ర ప్రభుత్వం అనుమతి
5. సీబీఐ కేసు రిజిస్టర్ చేయడం
6. సీబీఐ దర్యాప్తు ప్రారంభం
తాజావార్తలు
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!