Rajasthan: ఇంట్లో సమస్యలు ఉన్నాయని వెళ్తే.. ఆస్తి కాజేసిన తాంత్రికుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని జోధ్పూర్లో ఓ ఉపాధ్యాయుడు తన ఇంట్లో సమస్యలను దూరం చేసుకోవాలనుకున్నాడు. పరిష్కారం కోసం ఒక తాంత్రికుడి వద్దకు వెళ్లాడు. అయితే.. ఆ తాంత్రికుడు తన ఆస్తులన్నీ కాజేశాడు. దీంతో.. బాధితుడు ఆస్తులు, తన కుటుంబాన్ని రెండింటిని కోల్పోయాడు. కాగా.. ఈ ఘటనలో బాధితుడు భార్య సుష్మా దేవదా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాంత్రికుడు, అతని కుమారుడు సహా నలుగురిపై కేసు పెట్టింది. ఈ వ్యవహారం 2023లో మొదలు కాగా.. పోలీసులు విచారణ చేపట్టారు.
బాధితుడి భార్య పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త చేతన్రామ్ దేవదా ఇంటి సమస్యల కారణంగా మనస్తాపం చెంది తాంత్రికుడి వద్దకు వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తాంత్రికుడు కాలు ఖాన్ అనే వ్యక్తి చేతబడి చేసేవాడని.. ఈ క్రమంలో.. తన ఇంటి సమస్యలను పోగొట్టాలని తాంత్రికుడికి చెప్పినట్లు సుష్మా దేవదా తెలిపింది. అయితే.. నీ కష్టాలన్నింటికి కారణం నీ ఆస్తే అని తాంత్రికుడు చెప్పాడు. దానిని అమ్మాలని సలహా ఇచ్చారు.
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
Andhra Pradesh: ఏపీలో పెరిగిన పోలీసుల నిఘా.. సమస్యాత్మక ప్రాంతాలపై డేగకన్ను
అయితే.. ఆ ఆస్తిని తన పేరు మీదకు బదిలీ చేయమని ఒప్పించారు. వివాదాలు పరిష్కరించిబడిన తర్వాత తిరిగి ఆస్తి ఇస్తానని తాంత్రికుడు హామీ ఇచ్చాడు. తాంత్రికుడు మాటలు నమ్మిన బాధితుడు తన 4,000 చదరపు అడుగుల ఆస్తిని 2023 జూలైలో కాలు ఖాన్ పేరుకు బదిలీ చేశాడు. కాగా.. కష్టాలు తీరకపోవడంతో చేతన్రామ్ దేవదా మళ్లీ తాంత్రికుడిని సంప్రదించాడు. తన ఆస్తి పత్రాలను తనకు తిరిగి ఇవ్వాలని తాంత్రికుడు కాలు ఖాన్ను కోరాడు. అయితే.. తాంత్రికుడు మాత్రం నీ ఆస్తిని నీకు తిరిగి ఇస్తే నీ కుటుంబంలో మరణం సంభవిస్తుందని చెప్పాడు. అంతేకాకుండా.. 1,200 చదరపు అడుగులకు పైగా ఉన్న ఇతర ఆస్తిని కూడా వారి పేరుకు బదిలీ చేయమని బాధితుడిని ఒప్పించాడు.
అయితే.. ఈ ఆస్తిని తాంత్రికుడు కాలు రామ్ బాధితుడికి తెలియకుండానే బీర్బల్, రామ్ కిషోర్ అనే వ్యక్తులకు రూ.24.91 లక్షలకు విక్రయించాడు. అయితే, ఈ వ్యవహారంలో చేతన్రామ్ దేవదాకు డబ్బులు అందలేదు. కాగా.. 2024 మే 17న ఆస్తిని కొన్న వ్యక్తులు చేతన్రామ్ ఇంటికి వెళ్లంగా ఈ వ్యవహారం బయటపడింది. సుష్మా దేవదాకు మొత్తం విషయం తెలిసింది. దీంతో.. ఆస్తి కాజేశారని ఆమె నలుగురిపై కేసు పెట్టింది. ఈ కేసులో పోలీసులు ఎవరిని అరెస్టు చేయలేదు.
తాజావార్తలు
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!