Honor Killing : మరో పరువుహత్య.. ఎస్సైలుగా పనిచేస్తున్న తల్లిదండ్రులే కొడుకుతో హత్య..!
- తమిళనాడులో పరువుహత్య
- చిన్ననాటి స్నేహం ప్రేమగా మారింది
- తల్లిదండ్రులే కొడుకును హత్యకు ఉసిగొల్పారు
- నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్ననాటి స్నేహం ప్రేమగా మారి చివరికి పరువు హత్యకు దారి తీసిన ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. తూత్తుకుడి జిల్లా ఏరల్ సమీపంలోని ఆరుముగమంగళం ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్, సెల్వి దంపతుల కుమారుడు కవిన్కుమార్ చెన్నై ఐటీ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల సెలవులకు స్వస్థలానికి వెళ్ళిన కవిన్కుమార్ తన తాతకు అస్వస్థతగా ఉండటంతో ఆదివారం ఉదయం పాళయంకోట కేటీసీ నగర్ ప్రాంతంలో ఉన్న సిద్ధ వైద్య ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో తాతకు చికిత్స జరుగుతుండటంతో కవిన్కుమార్ బయట నిలబడ్డాడు. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఓ యువకుడు అతడిని పిలిచాడు. కొంత దూరం వెళ్లాక బైకు నిలిపి కవిన్కుమార్తో ఆ యువకుడు గొడవకు దిగి హఠాత్తుగా కత్తితో దాడి చేసి పారిపోయాడు. కత్తిపోట్లతో కవిన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పాళయంకోట పోలీసులు హుటాహుటిన వెళ్ళి కవిన్కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా కవిన్కుమార్ను హతమార్చింది పాళయం కోట కేటీసీ నగర్ ప్రాంతానికి చెందిన సుర్జిత్గా గుర్తించారు. సుర్జిత్ తండ్రి శరవణన్, తల్లి కృష్ణకుమారి ఎస్సైలుగా పనిచేస్తున్నారని తెలిసి, ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు సుర్జిత్ సహా, అతడి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. అతడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారించగా కవిన్కుమార్ది పరువుహత్యగా తేలింది.
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
కవిన్ చెన్నైలో టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. సుర్జిత్ సోదరి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ డాక్టర్గా పనిచేస్తోంది. అయితే ఉన్నత వర్గానికి చెందిన సుర్జిత్ సోదరి, కవిన్ గణేష్ కుమార్ బాల్య స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూలులో చదివారు. చిన్ననాటి స్నేహితులు కావడంతో ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సుర్జిత్ సోదరి సిద్ధ వైద్య ఆస్పత్రిలో పనిచేస్తుండటంతో ఆమెను చూడటానికి తరచూ వచ్చేవాడని, ఇద్దరు మాట్లాడుకోవడం చూసి సహించలేక పోయి ఎస్సైలైన యువతి తల్లిదండ్రులు కవిన్కుమార్ హత్య స్కేచ్ వేశారు. సోదరి ప్రేమను అన్న సుర్జిత్కు తెలియజేసి కవిన్ను చంపాలని ఉసిగొల్పారు. ఇక తన సోదరితో స్నేహం చేయడాన్ని సహించలేక సుర్జిత్ పథకం ప్రకారం హతమార్చినట్టు వాంగ్మూలం ఇచ్చాడని తెలిపారు.
పోలీసులు సుర్జిత్పై హత్య, అంటరానితనం నిరోధక చట్టం సహా నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు సుర్జిత్ తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. తమ కుమారుడి నేరానికి కుట్రపన్నారు. హత్య వెనుక అమ్మాయి సోదరుడితో పాటు, ఆమె తల్లిదండ్రుల హస్తం ఉందని బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిందితుడి తల్లిదండ్రులను వీఆర్లో ఉంచారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!