Pakistan: పరువు హత్య.. ప్రేమ వ్యవహారం అనుమానంతో భార్య సజీవదహనం
- పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో పరువు హత్య
- భార్యను సజీవ దహనం చేసిన భర్త
- భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానం.
పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. కొత్తగా పెళ్లయిన ఓ మహిళను ఆమె భర్త సజీవ దహనం చేశాడు. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. దీంతో.. ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహవల్నగర్కు చెందిన సబా ఇక్బాల్ను.. భర్త అలీ రజా హత్య చేశాడు. సబా, రజా ఎనిమిది నెలల క్రితం కోర్టు వివాహం చేసుకున్నారు. అయితే.. పెళ్లయిన తర్వాత తన భార్య సబా వేరొకరితో సంబంధం పెట్టుకుందని రజా అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో.. సబా భర్తతో గొడవపడి ఇల్లు వదిలి వెళ్లిపోయిందని భర్త రజా జూలై 28న ఫోన్లో చెప్పినట్లు సబా తండ్రి మహ్మద్ ఇక్బాల్ తెలిపారు. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది.
Mystery Behind the Bullets in Narsingi: నార్సింగిలో కలకలం.. బుల్లెట్ల వెనుక మిస్టరీ ఏంటి…?
Also Read
దీంతో.. సబా కోసం తన కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. అయితే.. ఒక పొలంలో సబా కాలిపోయిన మృతదేహం పడి ఉన్నట్లు సబా కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఈ విషయమై వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. మహిళ భర్త రజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మొదట సబాను కొట్టి, ఆపై కాల్చివేసినట్లు విచారణలో రజా పోలీసులకు చెప్పాడు. కాలిన మృతదేహాన్ని పొలంలో పడేసినట్లు తెలిపాడు. ఈ కేసులో పోలీసులు రజాతో పాటు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేశారు.
Karnataka Health Minister: జైపూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన మాంసం కుక్కలది కాదు.. గొర్రెలదే
ఇటీవల పాకిస్తాన్లో తన భర్త కొట్టిన కారణంగా విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసినప్పుడు కోపోద్రిక్తుడైన మామ మహిళ కాళ్ళను నరికేశాడు. ప్రస్తుతం ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుల్ టౌన్లో నివాసం ఉండే సోబియా, బటూల్ షా.. తన భర్త రోజూ కొట్టేవాడని తెలిపింది. ఇంతకుముందు.. తనకు, భర్తకు మధ్య ఒక గొడవ జరిగిందని, ఆ విషయంలో ఆమె తన భర్తను చాలాసార్లు ఒప్పించే ప్రయత్నం చేసింది.. కానీ భర్త అంగీకరించలేదు. ఈ క్రమంలో భర్త దురుసు ప్రవర్తన గురించి ఆ మహిళ తల్లిదండ్రులకు తెలిపింది. ఎక్కడి నుంచి ఎలాంటి ఆశ కనిపించకపోవడంతో ఆ మహిళ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ మహిళ విడాకుల కోసం దాఖలు చేయడంతో కుటుంబ పరువు పోయిందని.. ఆగ్రహించిన ఆమె మామ గొడ్డలితో సోబియా ఇంటికి చేరుకున్నారు. అనంతరం.. తన కాళ్లను గొడ్డలితో నరికి వెళ్లినట్లు సోబియా చెప్పింది. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!