Bandh Continue In Medak: నేడు మెదక్ జిల్లా బంద్కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు..
- నేడు మెదక్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు..
- అక్రమంగా జైలులో పెట్టిన వారిని విడుదల చేయాలని డిమాండ్..
- జిల్లా బంద్ కు ప్రజలు సహకరించాలని కోరిన హిందూ సంఘాలు
Bandh Continue In Medak: మెదక్ జిల్లాలో ఇవాళ (సోమవారం) బంద్కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. గోవుల రక్షణకు చేసిన ప్రయత్నంలో హిందువులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించారని పేర్కొన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ నేడు జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ, బీజేవైఎం తెలిపాయి. జిల్లా బంద్కు ప్రజలు సహకరించాలని సందర్భంగా వారు కోరాయి.
Read Also: Uttam Kumar Reddy : కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలి
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
కాగా, శనివారం రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ, పరస్పర దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఈ క్రమంలో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం సైతం మెదక్ పట్టణంలో బంద్ కు పిలుపనివ్వడంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్లు, హోటళ్లు, దుకాణాలు స్వచ్చందంగా క్లోజ్ చేశారు. బస్టాండ్లు, చౌరస్తాల దగ్గర పోలీసులు పికెట్ ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహించారు.. దీంతో ఆర్టీసీ బస్సులు నడిచాయి. ఇక, ఈ ఘటనపై రంగంలోకి దిగిన మల్టీజోన్ ఐజీ రంగనాథ్ మెదక్ పట్టణానికి వచ్చి ఎస్పీ బాలస్వామితో కలిసి పరిస్థితి గురించి సమీక్ష నిర్వహించారు.
Read Also: youtube: యూట్యూబ్ యూజర్స్ ఎక్కువగా వేటి కోసం సర్చ్ చేస్తున్నారో తెలుసా..?
అలాగే, శనివారం జరిగిన గొడవలు, దాడులకు కారణమైన ఇరు వర్గాలకు చెందిన 45 మందిని గుర్తించామని ఐజీ రంగనాథ్ చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసి ఓ వర్గానికి చెందిన తొమ్మిది మందిని అరెస్ట్ చేశామన్నారు. మరో వర్గానికి చెందిన వారిని సైతం అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఈ ఇష్యూపై ఎంపీ రఘునందన్ రావుతో ఐజీ ఫోన్ లో మాట్లాడారు. ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకుంటున్నామని ఎంపీకి ఆయన హామీనిచ్చారు. ఐజీ హామీతో మెదక్ కు రాకుండా మధ్యలోనే ఎంపీ రఘునందన్ రావు ఆగిపోయారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!