Bandh Continue In Medak: నేడు మెదక్ జిల్లా బంద్కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు..
- నేడు మెదక్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు..
- అక్రమంగా జైలులో పెట్టిన వారిని విడుదల చేయాలని డిమాండ్..
- జిల్లా బంద్ కు ప్రజలు సహకరించాలని కోరిన హిందూ సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandh Continue In Medak: మెదక్ జిల్లాలో ఇవాళ (సోమవారం) బంద్కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. గోవుల రక్షణకు చేసిన ప్రయత్నంలో హిందువులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించారని పేర్కొన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ నేడు జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ, బీజేవైఎం తెలిపాయి. జిల్లా బంద్కు ప్రజలు సహకరించాలని సందర్భంగా వారు కోరాయి.
Read Also: Uttam Kumar Reddy : కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలి
Also Read
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
కాగా, శనివారం రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ, పరస్పర దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఈ క్రమంలో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం సైతం మెదక్ పట్టణంలో బంద్ కు పిలుపనివ్వడంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్లు, హోటళ్లు, దుకాణాలు స్వచ్చందంగా క్లోజ్ చేశారు. బస్టాండ్లు, చౌరస్తాల దగ్గర పోలీసులు పికెట్ ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహించారు.. దీంతో ఆర్టీసీ బస్సులు నడిచాయి. ఇక, ఈ ఘటనపై రంగంలోకి దిగిన మల్టీజోన్ ఐజీ రంగనాథ్ మెదక్ పట్టణానికి వచ్చి ఎస్పీ బాలస్వామితో కలిసి పరిస్థితి గురించి సమీక్ష నిర్వహించారు.
Read Also: youtube: యూట్యూబ్ యూజర్స్ ఎక్కువగా వేటి కోసం సర్చ్ చేస్తున్నారో తెలుసా..?
అలాగే, శనివారం జరిగిన గొడవలు, దాడులకు కారణమైన ఇరు వర్గాలకు చెందిన 45 మందిని గుర్తించామని ఐజీ రంగనాథ్ చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసి ఓ వర్గానికి చెందిన తొమ్మిది మందిని అరెస్ట్ చేశామన్నారు. మరో వర్గానికి చెందిన వారిని సైతం అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఈ ఇష్యూపై ఎంపీ రఘునందన్ రావుతో ఐజీ ఫోన్ లో మాట్లాడారు. ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకుంటున్నామని ఎంపీకి ఆయన హామీనిచ్చారు. ఐజీ హామీతో మెదక్ కు రాకుండా మధ్యలోనే ఎంపీ రఘునందన్ రావు ఆగిపోయారు.
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!