Himanta Biswa Sarma: 3 ఈశాన్య రాష్ట్రాల్లో గెలుపు బీజేపీదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: మూడు ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జోస్యం చెప్పారు. మేఘాలయలో బీజేపీ మరింత ముఖ్యమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తోందన్నారు. త్రిపురలో అధిక మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటామన్నారు. నాగాలాండ్లో తాము మళ్లా ఎన్డీపీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈరోజు మేఘాలయ, నాగాలాండ్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో, ఈ నెలాఖరులో జరగనున్న కీలక ఎన్నికలకు బీజేపీ సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 16న త్రిపురలో ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 27న మేఘాలయ, నాగాలాండ్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఘంటాపథంగా ఉంది. త్రిపురలో, చారిత్రాత్మక ఆదేశంతో సున్నా నుంచి 36 స్థానాలను ఒంటరిగా గెలుచుకున్న తర్వాత ఐపీఎఫ్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిగతా రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ శక్తులతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ త్రిపురను మార్చేసిందని.. వామపక్ష పాలనలో ప్రజలు ప్రభుత్వాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారన్నారు. ఈసారి త్రిపురలో బీజేపీని అధికారానికి దూరం చేసేందుకు వామపక్షాలు, కాంగ్రెస్లు పొత్తు పెట్టుకున్నాయి. రాష్ట్రంలోని 60 స్థానాల్లో లెఫ్ట్ఫ్రంట్ 47 స్థానాల్లో పోటీ చేయనుండగా, కాంగ్రెస్కు కేవలం 13 స్థానాలు మాత్రమే మిగిలాయి. మొత్తం 60 స్థానాల్లో బీజేపీ 55, ఐపీఎఫ్టీ ఐదు స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
Vladimir Putin: ఉక్రెయిన్కు ఆయుధాల పంపిణీ.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
మేఘాలయలో ప్రస్తుతం కాన్రాడ్ సంగ్మా యొక్క నేషనల్ పీపుల్స్ పార్టీ బీజేపీ, మరో నాలుగు ప్రాంతీయ మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకుని పాలిస్తోంది. ఆరు పార్టీల మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ 50 ఏళ్లలో పూర్తి కాలాన్ని కొనసాగించిన మూడో కూటమి. అయితే ఇటీవలి నెలల్లో అధికార కూటమిలో చీలిక పెరుగుతోంది. బీజేపీ మొత్తం 60 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది.
నాగాలాండ్లో, 2018లో బీజేపీ 12 స్థానాలను గెలుచుకుంది. ఎన్డీపీపీ నేతృత్వంలోని నెఫియు రియో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఈసారి ఎన్డీపీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. మొత్తం 60 స్థానాల్లో ఎన్డీపీపీ 40, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?