Himanta Biswa Sarma: 3 ఈశాన్య రాష్ట్రాల్లో గెలుపు బీజేపీదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: మూడు ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జోస్యం చెప్పారు. మేఘాలయలో బీజేపీ మరింత ముఖ్యమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తోందన్నారు. త్రిపురలో అధిక మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటామన్నారు. నాగాలాండ్లో తాము మళ్లా ఎన్డీపీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈరోజు మేఘాలయ, నాగాలాండ్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో, ఈ నెలాఖరులో జరగనున్న కీలక ఎన్నికలకు బీజేపీ సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 16న త్రిపురలో ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 27న మేఘాలయ, నాగాలాండ్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఘంటాపథంగా ఉంది. త్రిపురలో, చారిత్రాత్మక ఆదేశంతో సున్నా నుంచి 36 స్థానాలను ఒంటరిగా గెలుచుకున్న తర్వాత ఐపీఎఫ్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిగతా రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ శక్తులతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ త్రిపురను మార్చేసిందని.. వామపక్ష పాలనలో ప్రజలు ప్రభుత్వాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారన్నారు. ఈసారి త్రిపురలో బీజేపీని అధికారానికి దూరం చేసేందుకు వామపక్షాలు, కాంగ్రెస్లు పొత్తు పెట్టుకున్నాయి. రాష్ట్రంలోని 60 స్థానాల్లో లెఫ్ట్ఫ్రంట్ 47 స్థానాల్లో పోటీ చేయనుండగా, కాంగ్రెస్కు కేవలం 13 స్థానాలు మాత్రమే మిగిలాయి. మొత్తం 60 స్థానాల్లో బీజేపీ 55, ఐపీఎఫ్టీ ఐదు స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
Vladimir Putin: ఉక్రెయిన్కు ఆయుధాల పంపిణీ.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
మేఘాలయలో ప్రస్తుతం కాన్రాడ్ సంగ్మా యొక్క నేషనల్ పీపుల్స్ పార్టీ బీజేపీ, మరో నాలుగు ప్రాంతీయ మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకుని పాలిస్తోంది. ఆరు పార్టీల మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ 50 ఏళ్లలో పూర్తి కాలాన్ని కొనసాగించిన మూడో కూటమి. అయితే ఇటీవలి నెలల్లో అధికార కూటమిలో చీలిక పెరుగుతోంది. బీజేపీ మొత్తం 60 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది.
నాగాలాండ్లో, 2018లో బీజేపీ 12 స్థానాలను గెలుచుకుంది. ఎన్డీపీపీ నేతృత్వంలోని నెఫియు రియో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఈసారి ఎన్డీపీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. మొత్తం 60 స్థానాల్లో ఎన్డీపీపీ 40, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!