MIM vs BJP Clash: బండి సంజయ్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత.. ఎంఐఎం వర్సెస్ బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ లో బండి సంజయ్, ఆయన ఎంపీ కార్యాలయం దగ్గర ఎంఐఎం కార్యకర్తల హాల్ చల్ చేశారు. ఎంఐఎం జెండాలతో 50కి పైగా బైక్ లపై కార్యకర్తలు ర్యాలీగా వచ్చి.. బీజేపీకి, బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక, బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఎంఐఎం కార్యకర్తలు అక్కడి నుంచి జారుకున్నారు. కాసేపటి తరువాత మళ్లీ వచ్చి ఎంపీ కార్యాలయం బోర్డును కొడుతూ బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎంఐఎం కార్యకర్తల తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గల్లీల్లో ర్యాలీకి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. హిందుత్వంపై దాడికి కుట్ర జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Afghanistan: ఇండియాలో ఆఫ్ఘాన్ ఎంబసీ మూసివేత.. యూకే, యూఎస్ఏలకు దౌత్యవేత్తలు..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తల సమాచారంతో ఎంపీ కార్యాలయానికి పోలీసులు చేరుకున్నారు. సంఘటన వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇక, రోడ్డు పైకి కర్రలతో బీజేపీ కార్యకర్తలు బయలుదేరి వచ్చారు. కరీంనగర్ లోని బండి సంజయ్ ఎంపీ ఆఫీస్ పై దాడి చేసేందుకు ప్రయత్నించిన కొందరిని కట్టెలతో బీజేపీ కార్యకర్తలు తరిమికొట్టారు.. కిలోమీటర్ పరిగెత్తించారు. ఇక, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
Read Also: Uniform Civil Code: స్వలింగ వివాహం యూసీసీ పరిధిలోకి రాదు..!
ఇక, విషయం తెలుసుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు రంగంలోకి దిగాడు. ఇద్దరు ఏసీపీలు, ఆరుగురు సీఐల ఆధ్వర్యంలో కరీంనగర్ లో భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పోలీసులు చేశారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి ఇప్పటికే బీజేపీ కార్యకర్తులు భారీగా చేరుకుంటున్నారు. ఎంఐఎం కార్యకర్తల తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ ఘటనను చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. శాంతి భద్రతలను కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు పర్యవేక్షిస్తున్నాడు.
- Tags
- bjp
- Clashes
- karimnagar
- MIM
- telangana
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!