Telangana High Court: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana High Court: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్లో ప్రతిపాదించి గవర్నర్కు పంపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని కొట్టి వేసే అధికారం గవర్నర్కు లేదని హైకోర్టు తెలిపింది. కేబినెట్కు తిప్పి పంపాలి తప్ప తిరస్కరించొద్దని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే కోదండరామ్, అలీఖాన్ల నియామకాన్ని కొట్టివేసింది.
Read Also: Arvind kejriwal : కేజ్రీవాల్ కు షాక్… మార్చి 16న ఈడీ ఎదుట హాజరు కావాల్సిందే అన్న కోర్టు
Also Read
- Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
- Trump: అణు తనిఖీలు, హార్ముజ్పై ట్రంప్ కీలక ప్రకటన.. వెంటనే ఖండించిన ఇరాన్
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
- Tragedy: ఫోన్ వాడొద్దన్నందుకు.. ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకిన బాలుడు..
అసలు విషయం ఏమిటంటే..
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను కేబినెట్ నామినేట్ చేసింది. వీరి పేర్లను గవర్నర్ తమిళి సై ఆమోదానికి పంపారు. అయితే గవర్నర్ తమిళిసై వీరిద్దరికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసే అర్హతలు లేవని తిరస్కరించారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరగడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం చకచకా జరిగిపోయింది. తమ పేర్లను గవర్నర్ ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని కోర్టుకు తెలిపారు. కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ కు లేదని పేర్కొన్నారు. వీరి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఏ విషయం తేల్చేవరకూ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఎంపిక ఉండబోదని రాజ్ భవన్ వర్గాలు చెప్పాయి. కానీ ఇంతలో ప్రొ.కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాకు ప్రతిపాదించింది. ఈ సిఫార్సుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తమ పిటిషన్ పెండింగ్ లో ఉండగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఆమోదించడంపై దాసోజు శ్రవణ్ , సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ పై తదుపరి విచారణ వరకు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం వద్దని హైకోర్టు ఆదేశించింది. తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్లో ప్రతిపాదించి గవర్నర్కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
NIMS Recruitment : నిమ్స్లో 122 జాబ్స్.. డిగ్రీ ఉంటే ఛాన్స్.!
-
Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
-
Trump: అణు తనిఖీలు, హార్ముజ్పై ట్రంప్ కీలక ప్రకటన.. వెంటనే ఖండించిన ఇరాన్
-
Thalaivar 173: రజనీకాంత్ ఫ్యాన్స్కు పూనకాలే.. ‘తలైవర్ 173’ టైటిల్ రివీల్ రేపే!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!