Site icon NTV Telugu

Balineni Srinivas Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు విచారణ

Ap High Court

Ap High Court

Balineni Srinivas Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో వీవీ ప్యాట్లల్లో ఓట్లు సరిపోల్చాలని మాక్ పోలింగ్ వద్దని బాలినేని పిటిషన్ వేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి తరఫు న్యాయవాది ఇవాళ వాదనలు వినిపించారు. బాలినేని తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు జడ్జి మెంట్ ప్రకారం ఈవీఎం, వీవీ ప్యాట్లను లెక్కించి సరిపోల్చాలని కోరామని కోర్టుకు వివరించారు. అందుకు విరుద్ధంగా ఎన్నికల సంఘం మాక్ పోలింగ్ నిర్వహిస్తోందని తెలిపారు. పోలింగ్‌కు ముందే మాక్ పోలింగ్ ఒకటికి రెండు సార్లు మెషీన్లు సామర్థ్యం చూసేందుకు చేపడతారన్నారు.

Read Also: YS Jagan: మాజీ సీఎం జగన్‌కు రాఖీలు కట్టేందుకు పోటీపడిన మహిళలు

ప్రీ మాక్ పోలింగ్ నిర్వహించిన ఎన్నికల అధికారులు మళ్ళీ పోస్ట్ మాక్ పోలింగ్ చేయటం సుప్రీం తీర్పుకు విరుద్ధమని న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. దీనివల్ల పిటిషనర్ కోరుతున్న విధంగా ఓట్ల లెక్కింపు సరిపోల్చటం కుదరదన్నారు. ఓడిపోయిన వ్యక్తి ఓటర్లు ఈవీఏంలలో వేసిన ఓట్లు వీవీ ప్యాట్లుగా మారినపుడు అవి కూడా సరిపోయినపుడు మాత్రమే సంతృప్తి చెందుతారన్నారు. అలా కాకుండా మాక్ పోలింగ్ చేయటం వల్ల ఏం తేలదని బాలినేని తరపు న్యాయవాదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మాత్రమే ఇక్కడ వ్యవహరించాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా.. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Exit mobile version