High Court: డీప్ఫేక్లు, ఏఐలను నియంత్రించేందుకు ఏం చేస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
- డీప్ఫేక్లు & ఏఐలను నియంత్రించేందుకు ఏం చేస్తున్నారు..
- కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న.
- మూడు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court Questioned Central Government: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్ఫేక్ టెక్నాలజీని నియంత్రించేందుకు ఏం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి మూడు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 21న జరగనుంది. డీప్ఫేక్ల ద్వారా వీడియోలు సృష్టించి అప్లోడ్ చేస్తున్నారని, వాటి ద్వారా వ్యక్తుల గురించి తప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నారని కోర్టు పేర్కొంది. డీప్ఫేక్ల వినియోగం పెరిగిపోయిందని, అందుకే వాటిని ఎదుర్కోవడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. దీనిపై కేంద్రం సీరియస్గా ఆలోచించాలి.
Read Also: Governor Jishnu Dev Sharma: నేడు భద్రాద్రి.. ఖమ్మం జిల్లాల్లో గవర్నర్ పర్యటన..
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏదైనా కమిటీని ఏర్పాటు చేశారా అని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇంకా కమిటీ వేయకపోతే కోర్టు కమిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపింది. అనంతరం కేంద్రం తరఫున హాజరైన ఏఎస్జీ చేతన్ శర్మ.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ దీనిని పరిశీలిస్తోందని చెప్పారు. ఈ విషయం సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మొత్తం సమాచారాన్ని బహిరంగపరచలేమని చేతన్ శర్మ అన్నారు. అప్పుడు కోర్టు కమిటీ గురించి అంతా చెప్పొద్దని, అయితే దీనిపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా అనేది తెలుసుకోవాలని అన్నారు. దీనిపై మూడు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.
Read Also: Governor Jishnu Dev Sharma: నేడు భద్రాద్రి.. ఖమ్మం జిల్లాల్లో గవర్నర్ పర్యటన..
ఈ అంశంపై చట్టం చేయడాన్ని పరిశీలించాలని ఆగస్టు 26న హైకోర్టు కేంద్రాన్ని అభ్యర్థించింది. ఇది ప్రపంచ సమస్య అని, తక్షణమే దృష్టి సారించాలని కోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కోర్టుకు తెలిపారు.
తాజావార్తలు
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్బై.. సీఎస్కే భవిష్యత్పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!