Jharkhand: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ఫిక్స్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
- అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం
- మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్
- ఈ నెల 26 ప్రమాణస్వీకారోత్సవం
- హాజరు కానున్న పలువురు ప్రముఖులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుత విజయం తర్వాత జార్ఖండ్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 26న జరగనుంది. ఈ కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వామపక్షాల దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొంటారు.
READ MORE: Suryapet: అన్నారం ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని కూటమి 56 స్థానాలతో భారీ విజయాన్ని నమోదు చేసి.. అధికారాన్ని నిలుపుకుంది. 81 సభ్యుల అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని కూటమి 56 స్థానాలను గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP) – నేతృత్వంలోని రాష్ట్రీయ డెమోక్రటిక్ కూటమి (ఎన్డిఎ) కేవలం 24 సీట్లతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.
READ MORE: Alcohol: మద్యం మానలేక పోతున్నారా? ఈ టిప్స్ పాటించండి.. ఆరోగ్యం కొంతైన మెరుగవుతుంది?
రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ కోసం 41 సీట్లు అవసరం. బీజేపీ 21 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా.. జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేసి 34 గెలుచుకుంది. ఇది ఇప్పటివరకు ఆ పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాలు ఇవే. కాంగ్రెస్కు 16, లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ నాలుగు, సీపీఐ (ఎంఎల్) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరీక్షలో పార్టీ విజయం సాధించిందని అన్నారు.
తాజావార్తలు
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!