Sikkim: సిక్కింలో విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు
- సిక్కింలోని మంగన్ జిల్లాలో భారీ వర్షాలు
- విరిగిపడ్డ కొండచరియలు
- ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిక్కింలోని మంగన్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు గురువారం తెలిపారు. మరోవైపు.. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి.. ఇళ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే.. భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగన్ జిల్లాలోని పక్షేప్ ప్రాంతంలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. రంగ్రాంగ్ సమీపంలో ముగ్గురు, పక్షేప్ నుండి ఇద్దరు మిస్సింగ్ అయినట్లు అధికారులు తెలిపారు.
Read Also: ATM Withdrawal Charges: అలర్ట్.. భారీగా పెరగనున్న క్యాష్ విత్డ్రా ఛార్జీలు..
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
మరోవైపు.. భారీ వరదలతో తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో సిక్కింలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలోని మెల్లి స్టేడియంను వరదలు ముంచెత్తుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. గీతాంగ్లో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. పెంటోక్ సమీపంలోని నాంపతంగ్ వద్ద రోడ్లు దెబ్బతిన్నాయి. ఉత్తర సిక్కింలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మొబైల్ నెట్వర్క్ సేవలకు అంతరాయం కలిగింది. మరోవైపు.. మంగన్ జిల్లాకు రేషన్ సరఫరాలతో కూడిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాన్ని జిల్లా యంత్రాంగం అభ్యర్థించింది.
Read Also: PK Mishra: ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా..మోడీతో ఆయనకున్న సంబంధమేంటి?
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్.. విపత్తుపై ఉత్తర జిల్లా యంత్రాంగం, పోలీసులు ఇతర అధికారులతో మాట్లాడారు. “బాధితులు, బాధిత కుటుంబాలకు రికవరీ సహాయం, తాత్కాలిక పరిష్కారం.. ప్రాథమిక అవసరాల సదుపాయంతో సహా సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని తమాంగ్ చెప్పారు. “బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది.. మృతుల కుటుంబాలకు, కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన, నిరాశ్రయులైన వారందరికీ ఆదుకుంటామని” తెలిపారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?