IMD : దక్షిణాది రాష్ట్రాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు!
- వాతావరణ పరిస్థితులపై ఐఎండీ కీలక అప్డెట్
- దక్షిణ దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు!
- గంటకు 40–50 కి.మీ వేగంతో గాలులు
- తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్ష సూచనల ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత వాతావరణ విభాగం (IMD) తాజాగా వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ను విడుదల చేసింది. ఏప్రిల్ 9 (బుధవారం) నుంచి 12వ తేదీ వరకు దక్షిణ దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40–50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగుపాటు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్ష సూచనల ప్రభావం కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, కేరళ, మాహే, కర్ణాటక రాష్ట్రాల్లో కనిపించనున్నట్లు ఐఎండీ పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగుపాట్ల ప్రభావం ఉండే అవకాశముందని తెలిపింది.
READ MORE: Mark Shankar Pawanovich: పవన్ ఫాన్స్ ఊపిరి పీల్చుకోండి.. మార్క్ బాబు సేఫ్..ఇదిగో ప్రూఫ్ !
Also Read
- Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
- Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
- Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్ కేబినెట్ ఖరారు.. కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
వడగాలులు, భారీ వర్షాలు
ఇక గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఏప్రిల్ 9, 10 తేదీల్లో అసోం, మేఘాలయలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఏప్రిల్ 10న అరుణాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ రోజు నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా, వాయవ్య భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ 10న వర్ష సూచనలు ఉన్నాయి.
నైరుతి, ఆగ్నేయ దిశల్లో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా వాయవ్యం, ఉత్తర దిశల వైపుగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుపాట్ల సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, అవసరమైన వేళల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని వాతావరణ శాఖ సూచించింది. అలాగే వ్యవసాయదారులు తమ పంటలను సంరక్షించేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించింది.
తాజావార్తలు
-
Vijay OathCeremony : విజయ్ ప్రమాణస్వీకారంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా హీరోయిన్ త్రిష.
-
TVK MLAs: తొలిసారి ఎమ్మేల్యేలుగా 93 మంది టీవీకే నాయకులు.. 40 మందిపై క్రిమినల్ ఆరోపణలు!
-
Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
-
Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!