M.Tech To Thief: ఎం.టెక్ వరకు చదివి దొంగగా మారిన ఐటీ ఇంజనీర్.. కారణం ఇదే..!
- అతను ఎం.టెక్ వరకు చదివాడు
- ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు
- చెడు వ్యక్తులతో స్నేహం చేశాడు
- జూదానికి బానిసై దొంగగా మారాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతను ఎం.టెక్ వరకు చదివాడు. ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కానీ చెడు వ్యక్తులతో స్నేహం చేసి జూదానికి బానిసయ్యాడు. ఆపై దొంగతనం చేసి ఇప్పుడు జైలుకు వెళ్లాడు. నాగ్పూర్లోని ధంతోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్పూర్లోని ధంతోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శీతల్ చింతల్వార్ ఇంట్లో దొంగతనం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు చంద్రపూర్ జిల్లాకు చెందిన ఆశిష్ రెడిమల్లా అని వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేయడానికి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నుంచి నాగ్పూర్కు వచ్చేవాడు. సాయంత్రం ఇళ్లను తనిఖీ చేసి రాత్రుల్లో దొంగతనం చేసేవాడు. మళ్లీ తిరిగి ఉదయం మొదటి బస్సులో చంద్రపూర్కు తిరిగి వెళ్లేవాడు.
READ MORE: Konda Murali: సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
నిందితుడు ఆశిష్ ఎం.టెక్ వరకు చదివాడని దర్యాప్తులో తేలింది. అతను నాగ్పూర్, పూణేలోని ఐటీ కంపెనీలలో కూడా పనిచేశాడు. కానీ, చెడు స్నేహితులను ఎంచుకున్నాడు. జూదానికి బానిసయ్యాడు. జూదంలో రూ.23 లక్షలు పోగొట్టుకున్నాడు. మొత్తం అప్పు తీర్చడానికి.. దొంగతనం ఓ సులభమైన మార్గంగా భావించాడు. నగరంలోని పెద్ద బంగ్లాల్లో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.
READ MORE: Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!
ఈ అంశంపై ధంతోలి పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ అనామిక మీర్జాపురే మాట్లాడుతూ.. “ఆశిష్ నాగ్పూర్లో పనిచేస్తున్నప్పుడు ఛత్రపతి నగర్ ప్రాంతంలో నివసించేవాడు. కాబట్టి అక్కడి ఇళ్ల గురించి అతనికి ముందే తెలుసు. అదే ప్రాంతంలోని విలాసవంతమైన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. చంద్రపూర్ నుంచి ఆశిష్ బస్సులో నాగ్పూర్కు వచ్చి ఖాళీ ఇళ్లను తనిఖీ చేసేవాడు. ఇప్పటివరకు 5 చోట్ల దొంగతనాలు చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం పోలీసుల కష్టడీలో ఉన్నాడు.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!