KTR : HCU భూములు అమ్మడానికి ప్రభుత్వం ఎందుకు ఆరాట పడుతుంది
- సెంట్రల్ యూనివర్సిటీ వల్ల ఆ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది
- 2003 ప్రాంతంలో IMG కి అప్పటి ప్రభుత్వం ల్యాండ్ కేటాయించింది
- కానీ మీరు ఇప్పుడు వేలం పెట్టి ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం రాజకీయ మలుపు తీసుకుంటోంది. ఈ అంశంపై విద్యార్థుల ఆందోళనలతో పాటు రాజకీయ నాయకుల ప్రస్తావనలు పెరుగుతున్నాయి. తాజాగా, తెలంగాణ భవన్లో HCU విద్యార్థులతో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థులు తమ ఆందోళనలను వ్యక్తం చేయగా, కేటీఆర్ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “HCU భూములు అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత ఆరాటపడుతుంది?” అని ప్రశ్నించారు. ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, “సెంట్రల్ యూనివర్సిటీ వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం వేలం వేయాలని చూస్తోంది” అని పేర్కొన్నారు. 2003లో అప్పటి ప్రభుత్వం IMG అనే సంస్థకు ల్యాండ్ కేటాయించిందని కేటీఆర్ గుర్తు చేశారు.
Also Read
- IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
- LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి కోసం అప్పట్లో భూమి ఇచ్చారని, కానీ ఇప్పుడు వేలం వేయాలనుకోవడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. “ఫ్యూచర్ సిటీ కోసం 45 వేల ఎకరాలను అమ్ముతామని చెబుతున్నారు, మరి ఈ 400 ఎకరాలను వదిలేస్తే ఏమవుతుంది?” అని ప్రశ్నించారు.
కేటీఆర్ రాహుల్ గాంధీ వైఖరిపై కూడా విమర్శలు చేశారు. గతంలో రెండు సార్లు రాహుల్ గాంధీ HCUకి వచ్చారని, కానీ ఇప్పుడు మాత్రం ఈ అంశంపై పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. “ఇతర రాష్ట్రాల్లో పర్యావరణంపై మాట్లాడే రాహుల్ గాంధీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని ప్రశ్నించారు. కేటీఆర్ మాట్లాడుతూ, “ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ HCUకి వచ్చి విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. కానీ ఇప్పుడు వారిని ఫుట్బాల్లా తిప్పుతున్నారు” అని ఆరోపించారు. విద్యార్థులు తమను HCUకి రావాలని కోరుతున్నారని, కానీ తాము అక్కడికి వెళ్లితే సీఎం రేవంత్ రెడ్డి ‘రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ విమర్శిస్తారని కేటీఆర్ తెలిపారు.
ఈ భూ వివాదంపై తాము హైకోర్టులో పిటిషన్ వేస్తామని, పార్లమెంట్లో కూడా పోరాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. “విద్యార్థుల భవిష్యత్తుకు తాము అండగా ఉంటామని, ఈ సమస్యకు న్యాయపరమైన , రాజకీయపరమైన పరిష్కారం కోరుతామని” అన్నారు. మొత్తంగా, HCU భూ వివాదం రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల ఆందోళనలతో పాటు, ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.
Blue Drum Sales: ఒక్క హత్య ‘‘డ్రమ్’’ బిజినెస్నే దెబ్బ తీసింది.. మీరట్ మర్డర్తో పడిపోయిన సేల్స్..
తాజావార్తలు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
-
Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!