Nandigama Suresh: వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandigama Suresh: అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యే శంకరనారాయణ, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు.. 4 ఏళ్ల వైఎస్ జగన్ పాలనకు ఎంతో తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే నైజం సీఎం జగన్ కు ఉందని అన్నారు. వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి అవినీతిలో పవన్ కళ్యాణ్ కు భాగస్వామ్యం కల్పించిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఎంపీ విమర్శించారు.
Read Also: CEC: సీఈసీ వద్దకు రాజకీయ పార్టీలు క్యూ.. వైసీపీ-టీడీపీ పరస్పరం ఫిర్యాదులు
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చరమగీతం పాడుతామని తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే, ఏపీలో టీడీపీ వస్తుందన్నట్లు చంద్రబాబు హడావుడి చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రెండు ఎకరాల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలకు చంద్రబాబు అక్రమ సంపాదన అని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. నియోజకవర్గ ఇంఛార్జ్ మార్పు కసరత్తుపై మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండే నాయకులకే సీఎం జగన్ టిక్కెట్లు ఇస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. సమన్వయకర్తల నియామకంలో కులాలను అంటగట్టొద్దని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్ పెద్దపీట వేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తమ ప్రత్యర్థి అని.. ఆ పార్టీలో ఎవరున్నా తాము వ్యతిరేకిస్తామని చెప్పారు.
Read Also: Ashika Ranganath: జూనియర్ అనుష్క అనిపించుకోవడం హ్యాపీనే.. నా సామిరంగ భామ ఆషిక రంగనాధ్ ఇంటర్వ్యూ
ఎమ్మెల్యే శంకరనారాయణ మాట్లాడుతూ.. బలహీన వర్గాలను బలోపేతం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య, పేదలకు కార్పొరేట్ విద్య అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే అని తెలిపారు. సీఎం జగన్ సామాజిక న్యాయం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తలెత్తుకుని తిరుగుతున్నాయని పేర్కొొన్నారు. కాగా.. కుట్రలకు మారుపేరు చంద్రబాబు నాయుడు అని దుయ్యబట్టారు. జగన్ పాలనలో జరిగిన సామాజిక న్యాయంపై బహిరంగ చర్చకు సిద్ధం అని అన్నారు. దమ్మూ, ధైర్యం ఉంటే చంద్రబాబు చర్చకు సిద్ధమా..? అని ఎమ్మెల్యే శంకరనారాయణ సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!