Harish Rao : నీటి హక్కులను ఆంధ్రాకు తాకట్టు పెట్టి, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు..
- సీతారామ ప్రాజెక్టుకు CWC అనుమతులున్నా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం
- ఖమ్మం జిల్లాకు సాగునీటి వనరుగా రూపుదిద్దుకున్న భారీ ప్రాజెక్టు
- బీఆర్ఎస్ విజయాలను కాంగ్రెస్ తమ ఘనతగా చూపించడంపై హరీష్ రావు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : తెలంగాణలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని కాంగ్రెస్ పార్టీ తక్కువ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, అదే అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది అంటూ హరీష్ రావు మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం (CWC), హైడ్రాలజీ అనుమతులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనుమతులేదంటూ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు.
2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ డీపీఆర్ను సీడబ్ల్యూసీకి సమర్పించిందని, అనంతరం 2021లో ఈ ప్రాజెక్టుకు అవసరమైన 113.795 టీఎంసీల నీటి లభ్యతను సీడబ్ల్యూసీ ఆమోదించిందని హరీష్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటిని కూడా అందించాలన్నదే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Bhairavam : ‘భైరవం’ నుండి మరో పాట విడుదల..!
సమైక్య పాలనలో నీటి దోపిడికి కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదని, కానీ ఇప్పుడు తెలంగాణ హక్కులను ఆంధ్రాకు తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ 90% పనులను పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ కోర్టు కేసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
“ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస అవగాహన లేకుండా అనుమతుల్లేవంటూ మాట్లాడడం దుర్మార్గం,” అని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సాగునీటి రంగంలో బీఆర్ఎస్ విజయాలను తాము సాధించినవిగా చూపించుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. “తెలంగాణకు సాగునీటి విషయంలో 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన అన్యాయం చేస్తే, బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో విజయ బావుటా ఎగురవేసింది,” అని హరీష్ రావు స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వినియోగంలో సమర్థతను సాధించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
Pulwama Attack: పుల్వామా ఉగ్రవాద దాడిలో మా ప్రమేయం ఉంది.. అంగీకరించిన పాక్ సైన్యం
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!