Harish Rao : సర్పంచ్లకు శుభవార్త చెబుతున్నాం.. ఏప్రిల్ 1 నుంచి నేరుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి కులబ్ గుర్ లో దీనదయాళ్ జాతీయ పంచాయతీ 2021-22 అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, జడ్పీ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో 27 గ్రామ పంచాయతీలు జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నాయన్నారు. నిన్న సోలాపూర్ నుంచి కొందరు కౌన్సిలర్లు వచ్చారని, 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు వస్తుందట.. బీదర్ లో బావుల దగ్గర నుంచి నీళ్లు తెచుకుంటున్నారట.. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఇది పరిస్థితి అని ఆయన వివరించారు. మన దగ్గర ఇంటింటికి ప్రతి రోజు నీరు వస్తుంది…ఇది తెలంగాణ మోడల్ అని ఆయన వ్యాఖ్యానించారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు 10 వేలు ఇస్తున్నారు..బీజేపీ వాళ్ళు 10 వేలు సరిపోవు అంటున్నారని, ఢిల్లీ నుంచి 10 వేలు తెచ్చి.. మీరో 10 వేలు ఇవ్వండి ఇద్దరం కలిపి 20 వేలు ఇద్దామన్నారు.
Also Read : T.Congress : రచ్చకెక్కిన హనుమకొండ కాంగ్రెస్ వర్గ పోరు
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
బీజేపీకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని, నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ.. పెట్రోల్ ధరలు పెంచింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. గ్యాస్ ధరలు పెంచింది బీజేపీ.. మోటర్లకు మీటర్లు పెట్టింది బీజేపీ అని ఆయన దుయ్యబట్టారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా ఎందుకు చేయలేదని బిజెపి వాళ్ళు అడుగుతున్నారు…ముందు మీ ప్రధాని రాష్ట్రంలో అమలు చేయండని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సంసద్ యోజన లో 10 కి 10 తెలంగాణ గ్రామ పంచాయతీలే ఉన్నాయని, సర్పంచ్ లకు శుభవార్త చెబుతున్నామన్నారు. ఏప్రిల్ 1 నుంచి నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో వేస్తామని ఆయన తెలిపారు. పని చేసిన వెంటనే బిల్లులు చెల్లించుకునే అవకాశం మీకే కల్పించామని, గతంలో సర్పంచ్ లకు కాలిపోయిన మోటర్లకు రిపేర్ చేయించుడే పని… బావులను తవ్వుడే పని అని, ఆనాడు అంతా ఎర్ర దీపాలు, గుడ్డీ దీపాలు కరెంట్ సరిగా లేకుండే.. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన 24 గంటల కరెంట్ వస్తుంది.. రాబోయే రోజుల్లో సంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!