Harish Rao : సర్పంచ్లకు శుభవార్త చెబుతున్నాం.. ఏప్రిల్ 1 నుంచి నేరుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి కులబ్ గుర్ లో దీనదయాళ్ జాతీయ పంచాయతీ 2021-22 అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, జడ్పీ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో 27 గ్రామ పంచాయతీలు జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నాయన్నారు. నిన్న సోలాపూర్ నుంచి కొందరు కౌన్సిలర్లు వచ్చారని, 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు వస్తుందట.. బీదర్ లో బావుల దగ్గర నుంచి నీళ్లు తెచుకుంటున్నారట.. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఇది పరిస్థితి అని ఆయన వివరించారు. మన దగ్గర ఇంటింటికి ప్రతి రోజు నీరు వస్తుంది…ఇది తెలంగాణ మోడల్ అని ఆయన వ్యాఖ్యానించారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు 10 వేలు ఇస్తున్నారు..బీజేపీ వాళ్ళు 10 వేలు సరిపోవు అంటున్నారని, ఢిల్లీ నుంచి 10 వేలు తెచ్చి.. మీరో 10 వేలు ఇవ్వండి ఇద్దరం కలిపి 20 వేలు ఇద్దామన్నారు.
Also Read : T.Congress : రచ్చకెక్కిన హనుమకొండ కాంగ్రెస్ వర్గ పోరు
Also Read
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
బీజేపీకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని, నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ.. పెట్రోల్ ధరలు పెంచింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. గ్యాస్ ధరలు పెంచింది బీజేపీ.. మోటర్లకు మీటర్లు పెట్టింది బీజేపీ అని ఆయన దుయ్యబట్టారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా ఎందుకు చేయలేదని బిజెపి వాళ్ళు అడుగుతున్నారు…ముందు మీ ప్రధాని రాష్ట్రంలో అమలు చేయండని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సంసద్ యోజన లో 10 కి 10 తెలంగాణ గ్రామ పంచాయతీలే ఉన్నాయని, సర్పంచ్ లకు శుభవార్త చెబుతున్నామన్నారు. ఏప్రిల్ 1 నుంచి నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో వేస్తామని ఆయన తెలిపారు. పని చేసిన వెంటనే బిల్లులు చెల్లించుకునే అవకాశం మీకే కల్పించామని, గతంలో సర్పంచ్ లకు కాలిపోయిన మోటర్లకు రిపేర్ చేయించుడే పని… బావులను తవ్వుడే పని అని, ఆనాడు అంతా ఎర్ర దీపాలు, గుడ్డీ దీపాలు కరెంట్ సరిగా లేకుండే.. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన 24 గంటల కరెంట్ వస్తుంది.. రాబోయే రోజుల్లో సంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!