Harish Rao: “అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్పై కేసు పెట్టారు “.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
- న్యాయవాదులతో మాట్లాడుతున్నాం
- కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టారు
- అన్ని విషయాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది
- సర్వే రిపోర్ట్ వచ్చింది
- అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్ పై కేసు
- మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హై కోర్టు తీర్పుపై న్యాయవాదులతో మాట్లాడుతున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ.. “కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టారు. ఈ ఏడాదిలో అన్ని విషయాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అని సర్వే రిపోర్ట్ వచ్చింది. అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్ పై కేసు పెట్టారు. కుట్ర తో చేస్తున్నారు అని క్లియర్ గా తెలుస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నోటీస్ ఇచ్చినందుకు కేటీఆర్ విచారణకు వెళ్లారు. ప్రభుత్వం తీరు బాగా లేదు అని న్యాయవాదులతో కలిసి వెళ్తాను అన్నారు. అరగంట సేపు రోడ్డు మీదనే ఉన్నారు. కేటీఆర్ మళ్ళీ విచారణకు వెళ్తాడు కక్ష సాధింపునకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. ఇది కుట్రపూరితంగా పెట్టారు. ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి.. కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు.” అని హరీశ్ రావు పేర్కొన్నారు.
READ MORE: Uttar Pradesh: ఆరుగురు పిల్లలను భర్త దగ్గర వదిలి.. బిచ్చగాడితో లేచిపోయిన భార్య
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
కోర్టు కేసును కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. “తప్పు జరిగింది అని కోర్టు చెప్పలేదు. ఇదొక తుఫెల్ కేసు. 9 వ తేదీ ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్తారు. ఇవాళ అరెస్ట్ చేస్తారా? రేపు అరెస్ట్ చేస్తారా? వాళ్ళ ఇష్టం. విచారణకు పూర్తిగా సహకరిస్తాం. అడ్వకేట్ లు వెళితే తప్పేంటి? రాహుల్ గాంధీ విచారణ కు వెళితే… అడ్వకేట్ లు కూడా వెళ్లారు. గతంలో గ్రీన్ కో కు మేము ఏమి ఇవ్వలేదు. గ్రీన్ కోకు మేము లాభం చేకూర్చినట్లు ఎక్కడా లేదు. ఇక్కడ అవినీతి కి ఆస్కారం లేదు. కాళేశ్వరం ఇష్యూ తర్వాత మాట్లాడదాం. కోర్ట్ జడ్జిమెంట్ వచ్చాక పై కోర్టుకు వెళ్లాలా వద్దా అనేది మా లీగల్ టీమ్ తో చర్చిస్తాం.” అని తెలిపారు.
READ MORE: Oscars 2025 : ఆస్కార్ బరిలో సూర్య కంగువా
రేవంత్ రెడ్డి కేసుపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు ఆ కేసుకు ఈ కేసుకు పోలిక లేదన్నారు. రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారని తెలిపారు. “కేటీఆర్ రాష్ట్రం ఇమేజ్ పెంచినందుకు కేసు పెట్టారు. అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్ పై కేసు పెట్టారు. మాపై కేస్ లు పెడతారని మాకు ముందే తెలుసు. కేసులతో మానసికంగా మమ్మల్ని బలహీన పర్చాలని చూస్తున్నారు.
కేవలం విచారణ కొనసాగించాలని మాత్రమే హై కోర్టు చెప్పింది. తప్పు జరిగింది అని కోర్టు చెప్పలేదు. విచారణ కు సహకరిస్తాం.” అని హరీశ్ రావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!