Harish Rao : బీజేపీది మేకపోతు గాంభీర్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. అయితే.. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో.. రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రాజ్ నాథ్ సింగ్ ఇక్కడ వచ్చి బాగా మాట్లాడుతున్నారని, బీజేపీది మేకపోతు గాంభీర్యమంటూ హరీష్ రావు సెటైర్లు వేశారు. మీకు పోటీ చేయడానికి నియోజకవర్గాల్లో నాయకులే లేరని, తెలంగాణ విభజన చట్టంలో ఉన్న హామీలను ఇప్పటి వరకు బిజెపి ఎందుకు నేరవేర్చలేదన్నారు. తెలంగాణ కి హక్కుగా రావాల్సిన 1500 కోట్లు ఆపారని, బోరు బావులకు మీటర్లు పెట్టలేదని 35 వేల కోట్లు ఆపారన్నారు హరీష్ రావు.
అంతేకాకుండా.. ‘తెలంగాణ లో ఏం అభివృద్ధి జరగలేదు అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. మేం అభివృద్ధి చేయకపోతే మా పథకాలను మీరు ఎందుకు కాపీ కొట్టారు. ఢిల్లీలో మాకు అవార్డులు ఇస్తారు..పార్లమెంట్ లో ప్రశంసిస్తారు.. గల్లీలో మాత్రం తిడుతారు. ప్రధాని మోడీ కూడా సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చినా నీళ్ల గురించి మాట్లాడుతారని స్వయంగా ప్రధాని చెప్పారు. ఓట్లు వచ్చాయని తిడితే మీ మాటలు జనం నమ్మే పరిస్థితి లేదు.
కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకి సీట్లు కావాలంటే ఢిల్లీకి పోవాలి, పదవులు కావాలంటే ఢిల్లీకి పోవాలి. చివరికి మీకు ఓట్లు కావాలన్న ఢిల్లీ నుంచి నేతలు రావాలి. రాజ్ నాథ్ సింగ్ కి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివి నవ్వుల పాలయ్యారు. స్కీములతో తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తుంటే కర్ణాటక లో రోజుకో స్కాములో కాంగ్రెస్ పార్టీ లీలలు బయటికి వస్తున్నాయి. 11సార్లు గెలిచిన కాంగ్రెస్ చేయని అభివృద్దిని పదేళ్ళలో సీఎం కేసీఆర్ చేసి చూపించారు.
Also Read
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
బీజేపీ హాయంలో సిలిండర్ కొంటేనే కళ్లలోంచి నీళ్లు వస్తున్నాయి. ఆనాడు 300 ఉంటే ధర్నాలు చేసిన బీజేపీ… ఈ రోజు వెయ్యికి పైగా ధరకు ఇస్తుంది. ఏ ప్రభుత్వం కూడా విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెట్టలేదు. మేనిఫెస్టోతో ప్రతిపక్షాలు బిత్తరపోయాయి. జనమంతా కారు గుర్తుకే ఓటద్దామని ఫిక్స్ అయ్యి ఉన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే. కాంగ్రెస్ వాళ్లు టికెట్లు అమ్ముకున్నారని రోజు గొడవలు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నోట్లకి సీటు అమ్ముకుంటున్నారని వాళ్ల పార్టీ నాయకులే అంటున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టిందని రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాపీ కొట్టింది మీరు..మేము కాదు. రైతు బంధు పెట్టింది ఎవరు..సీఎం కేసీఆర్ కాదా. రైతులు, పెన్షన్ దారులు అందరూ సీఎం కేసీఆర్ వైపే ఉన్నారు. నమ్మకానికి మారు పేరు కేసీఆర్.. నయవంచన కి మారు పేరు కాంగ్రెస్ పార్టీ. రైతు భీమా తరహాలో కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా పథకం కావాలని ఎవరైనా ఆడిగారా.’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!