Site icon NTV Telugu

Harish Rao : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళింది

Harish Rao

Harish Rao

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ పై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళిందన్నారు. అవినీతిపరుల పార్టీగా మారిందని ఆయన విమర్శించారు. నోటుకు ఓటు కేసులో పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. 50 కోట్లు పెట్టి టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డి కొనుక్కున్నాడని ఆ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడని మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు. ఆ డబ్బులు ఓ ఎంపీ ద్వారా ఇచ్చాడని ఆరోపణలున్నాయన్నారు. ఐదు కోట్లు.. పదేకరాల భూమికి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారన్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సగం సీట్లలో కాంగ్రెస్ కు అభ్యర్థులులేరు.. పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి కాంగ్రెస్ లో ఉందన్నారు.

అంతేకాకుండా.. ‘సొంత నియోజకవర్గాల్లో గెలవలేని కాంగ్రెస్ నేతలు తమపై పోటీ చేస్తారట. కాంగ్రెస్ పార్టీ అంటే మోసానికి మారుపేరు. మాటలు ఎక్కువ చేతలు తక్కువ. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి మహిళలను ఏడిపిస్తుంది. కడియం శ్రీహరి, రాజన్న నాయకత్వం లో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ ను గెలిపించాలి. రాజన్న కు భవిష్యత్తు ఉంది.. ఆయన అనుచరులు ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుంటాం. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుంది. ‘ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Exit mobile version