Harish Rao : ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు
- ఒక చీర కాదు.. రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు
- దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సాహపరిచింది
- 15వేలు రైతుబంధు అన్నాడు.. గుండు సున్నా చేశాడు : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని హరీష్ రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఒక చీర కాదు.. రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు, దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సాహపరిచిందన్నారు. 15వేలు రైతుబంధు అన్నాడు .. గుండు సున్నా చేశాడని ఆయన విమర్శించారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడని హరీష్ రావు మండిపడ్డారు. ముదిరాజ్, గంగపుత్రులంటే సీఎం రేవంత్ కు చిన్నచూపని, ఆగస్ట్ లో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదన్నారు. మేము 100కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్ లో పెట్టిందె 16కోట్లు అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. చేప పిల్లలు డబుల్ పోస్తామని చెప్పి.. ఇప్పుడు చేప పిల్లలు సగమే పోయాలని అంటున్నారన్నారు. చెరువులు నిండుకుండలా ఉన్నప్పటికీ.. చేప పిల్లల సగమే పోయాలంటున్నారని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు అంటూ ఆయన సెటైర్ వేశారు.
Railway: రైలులో ప్రయాణించే రోగులకు రైల్వే ప్రత్యేక రాయితీ.. ఏ రోగులకు ఎంత రాయితీ తెలుసా..?
Also Read
- Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు..
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
- TIMS: సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
అంతేకాకుండా..’కాంగ్రెస్ ముఖ్యనేతల కోసం రీజల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చారు. ముఖ్యనేతల భూములున్నాయని రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కొందరు స్వార్థం కోసం ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చటం దారుణం. దీని వలన 16కిమీ దూరం పెరుగుతుంది. కేంద్రమే నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ.. దక్షిణ భాగాన్ని కావాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తామంటోంది. దీని వలన 20వేల కోట్లు అదనంగా ఖర్చు అవుతాయి. కొందరు స్వార్థం కోసం ప్రజలపై 20వేల కోట్లు భారం పడుతుంది. రుణమాఫీకి పుట్టని అప్పు.. రింగ్ రోడ్ నిర్మాణానికి పుడుతున్నాయా? ఉత్తర భాగం 158కిమీ కేంద్రమే నిర్మిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10నెలలు అయినా కూడా ఉత్తర భాగం నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. రైతులకు మార్కెట్ రేటు ఇచ్చి భూసేకరణ చేయాలి’ అని హరీష్ రావు అన్నారు.
Russian-Ukraine War: ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి.. 136 డ్రోన్లు ప్రయోగం
తాజావార్తలు
-
Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు..
-
Nidhhi Agerwal: లేడీ ఓరియంటెడ్ మైథాలజీ థ్రిల్లర్తో నిధి అగర్వాల్
-
Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
-
TIMS: సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!