Harish Rao: మాజీ మంత్రి హరీష్రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. పరిగిలో రైతులకు సంఘీభావంగా వెళుతున్న హరీష్ను పోలీసుల అరెస్ట్ చేశారు. ఈ అంశంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల బాధ వినడానికి తాము వెళ్తామ చెబుతున్నా వినడం లేదన్నారు. “రేవంత్ రెడ్డి పరిస్థితి పిచ్చోడు చేతిలో రాయిలాగా తయారైంది.. హైడ్రా పేరిట పేదల గుడిసెలు కూల్చే ప్రయత్నం చేశారు. మూసి పేరిట అపార్ట్మెంట్లను కూల్చే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీ భూములను లాక్కునే ప్రయత్నం చేశారు. ఫ్రూట్ మార్కెట్ ల్యాండ్ కూడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. దళిత బలహీన వర్గాల మీద దండయాత్ర చేస్తున్నారు. అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు.. కానీ ఉన్న భూములు లాక్కుంటున్నారు. ఎక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములు ఉంటే అక్కడ ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఇస్తున్నారు ముందస్తుగా అరెస్టు చేసినా సరే మేము అక్కడికి వెళ్లి తీరుతాం. మీరు ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చండి. అధికారంలోకి వచ్చేవరకు ఒక మాట వచ్చిన తర్వాత మరో మాట కాంగ్రెస్ చెబుతోంది. భూములు తప్ప ఇంకోటి పట్టదా? పాలన చేయమంటే భూములు లాక్కోవడం ఏంటి?” అని హరీష్రావు ప్రశ్నించారు.
READ MORE: Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్దేవ్పై ఆదిత్య ధర్ ప్రశంసలు!
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
- Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
అసలు ఏం జరిగింది?
పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 1,197 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తమ భూములను ఇచ్చేది లేదని రైతులు రిలే దీక్షలు చేపట్టారు. రైతు ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాల్లో పర్యటించి సంఘీభావం తెలిపేందుకు హరీష్రావు బయలు దేరారు. పరిగి పర్యటనకు బయల్దేరిన హరీష్ రావును అప్ప జంక్షన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన నేతలను స్టేషన్కు తరలించారు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు పోలీస్ వాహనాల్లో బీఆర్ఎస్ నేతలను తరలించారు.
తాజావార్తలు
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!