Harirama Jogaiah: టీడీపీ-జనసేన మినీ మేనిఫెస్టోపై హరిరామ జోగయ్య అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harirama Jogaiah: తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ మినీ మేనిఫెస్టో పై మాజీ మంత్రి హరిరామ జోగయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు.. జనసేన-టీడీపీ కూటమి మినీ మేనిఫెస్టోపై విశ్లేషణతో ఓ లేఖ విడుదల చేశారు.. టీడీపీ- జనసేన మినీ మేనిఫెస్టో నిరాశకు గురి చేసిందన్న ఆయన.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మినీ మేనిఫెస్టో దీటుగా లేదన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చగలిగే నిర్దిష్టమైన అంశాలు లేవని విమర్శించారు. ఇరు పార్టీలు తయారుచేసిన మినీ మేనిఫెస్టో అంత ఆకర్షణీయంగా, జనారంజకంగా లేదు.. కనీసం నాలుగు కోట్ల మంది సంతృప్తి పడేవిధంగా మేనిఫెస్టో రూపొందించడం శ్రేయస్కరం అని సూచించారు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు, మాజీ మంత్రి సీహెచ్ హరి రామజోగయ్య.
Read Also: Health Tips : మటన్ ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
కాగా, వచ్చే ఎన్నికల కోసం పొత్తు ఖరారు చేసుకున్న తెలుగుదేశం-జనసేన పార్టీలు.. ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేశాయి.. ఈ కమిటీలో జనసేన నుంచి ముత్తా శశిధర్, వరప్రసాద్, శరత్ కుమార్ ఉంటే.. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, పట్టాభి, అశోక్ బాబు ఉన్నారు. ఈ కమిటీ నిన్న జరిపిన భేటీలో కీలకమైన కొన్ని అంశాల్ని చర్చించింది. జనసేన ప్రతిపాదించిన 5 అంశాలు, టీడీపీ ప్రతిపాదిత 6 అంశాలపై చర్చించి కమిటీలో తుది నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 11 అంశాలతో తొలి దశ మేనిఫెస్టో సమావేశం జరిగింది.. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగింపు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు 10 లక్షల రాయితీ.. బీసీలకు రక్షణ చట్టం, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, ప్రస్తుత పథకాల కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం, ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా, పేదరిక నిర్మూలన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రక్షణ, సంపన్న ఏపీ నిర్మాణం ఇలా మినీ మేనిఫెస్టో రూపొందించారు.. అయితే, ఇప్పటి వరకు జనసేనకు, పవన్ కల్యాణ్కు మద్దతుగా మాట్లాడుతూ వచ్చిన హరిరామ జోగయ్య.. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోపై అసంతృస్తి వ్యక్తం చేయడం చర్చగా మారింది.

తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?