Shreyas Iyer: 7 మ్యాచ్ల నిరీక్షణకు తెర.. రెండు చెత్త రికార్డుల నుంచి శ్రేయస్కు విముక్తి!
- తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం
- శ్రేయస్ అయ్యర్కు వ్యక్తిగతంగా కూడా కలిసొచ్చిన తొలి టీ20
- రెండు చెత్త రికార్డుల నుంచి శ్రేయస్కు విముక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Breaks Unwanted T20I Captaincy Records: జింబాబ్వే పర్యటనను టీమిండియా ఘన విజయంతో ప్రారంభించింది. గురువారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు వ్యక్తిగతంగా కూడా కలిసొచ్చింది. సర్పంచ్ సాబ్ కెప్టెన్సీ చేపట్టాక వరుస పరాజయాలు వెంటాడగా.. ఈ విజయం అతడికి భారీ ఊరటను ఇచ్చింది.
టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్ తొలి ఏడు మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా అందుకోలేదు. ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో భారత్ 2-0తో ఓడిపోగా.. ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో 4-0తో పరాజయం పాలైంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొత్తం ఏడు మ్యాచ్ల్లో ఆరు ఓటములు, ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగియడంతో.. భారత జట్టు టీ20 చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ విజయరహిత పరంపరను నమోదు చేసింది. అయితే జింబాబ్వేపై విజయం సాధించడం ద్వారా ఆ చెత్త రికార్డుకు బ్రేక్ పడింది.
Also Read
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- IND Vs SL: మొదటి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
- BCCI Chief Selector: అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ భేటీ.. చీఫ్ సెలెక్టర్గా మాజీ పేసర్?
- Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
అంతేకాదు శ్రేయస్ అయ్యర్ మరో చెత్త రికార్డు నుంచి కూడా విముక్తి పొందాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా ఏడు టాస్లు గెలిచి కూడా.. ఒక్క మ్యాచ్ గెలవని కెప్టెన్గా సర్పంచ్ సాబ్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు జాబితాలో బల్గేరియా మాజీ కెప్టెన్ ప్రకాశ్ మిశ్రా (ఏడు మ్యాచ్) తో కలిసి శ్రేయస్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు జింబాబ్వేపై విజయం సాధించడంతో ఆ అపజయ పరంపరకు కూడా బ్రేక్ పడింది. అర్జెంటీనాకు చెందిన హెర్నాన్ ఫెన్నెల్ ఆరు మ్యాచ్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలర్లు జింబాబ్వేను 125/7కే పరిమితం చేశారు. అనంతరం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లోనే అర్ధశతకం బాదడంతో భారత్ లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా కొత్త ఆరంభం చేసింది. వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ విజయం జట్టుకు మాత్రమే కాకుండా కెప్టెన్గా అయ్యర్కు కూడా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని అందించింది. మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ అదే జోరును కొనసాగించి సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత్ చూస్తోంది.
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?