MS Dhoni: ఎంఎస్ ధోనితో నాకు నిజంగానే విభేదాలు ఉన్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అతడు అందించారు. అంతేకాదు.. టీమ్ ఎంపికతో స్టార్ట్ అయి.. గ్రౌండ్ లో వ్యూహాల అమలు వరకు ఆటకు సంబంధించిన ప్రతీ విషయంలో పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతాడు ధోని. ఈ క్రమంలో కొన్నిసార్లు మహేంద్రుడు విమర్శల పాలయ్యాడు కూడా..! ముఖ్యంగా ఒకప్పటి స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్కు ధోని అన్యాయం చేశాడంటూ.. ఆయన తండ్రి యోగ్రాజ్ బహిరంగానే విమర్శించాడు. ఇక, వన్డే వరల్డ్కప్-2011 టీమ్ లో రోహిత్ శర్మను కాదని.. పీయూశ్ చావ్లాను తీసుకోవడం లాంటివి ధోని చేశాడు.
Read Also: Chandrababu Arrest: చంద్రబాబును ప్రశ్నించేందుకు రేపు రాజమండ్రికి సీఐడీ బృందం
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ హాట్ కామెంట్స్ చేశాడు. తనకూ ఒకప్పుడు ఎంఎస్ ధోనితో విభేదాలు ఉన్నాయంటూ తెలిపాడు. కాగా ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో ఈ కేరళ బౌలర్ సభ్యుడిగా ఉన్నాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ ప్లేయర్ మిస్బా ఉల్ హక్ క్యాచ్ పట్టి భారత్ను విజయతీరాలకు చేర్చడంలో శ్రీశాంత్ కీ రోల్ పోషించాడు. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనితో విభేదాలు ఉన్నాయని అతడు చేసిన కామెంట్స్ కు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Dhruva Natchathiram: ఏడేళ్లకి మోక్షం.. సెన్సార్ అయిపోయింది..ఇక ఆగేదే లేదు!
ధోని భాయ్తో నాకు విభేదాలున్న మాట వాస్తవమేనని శ్రీశాంత్ అన్నాడు. అయితే.. క్రికెట్ పరంగా గత కొన్నేళ్లలో మనం సాధించిన విజయాలను చూస్తే.. ధోని తమకు సపోర్ట్ గా నిలవలేదని అతడు చెప్పుకొచ్చాడు. అయితే.. ప్రతికూల పరిస్థితుల కారణంగా కెప్టెన్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.. సారథ్య బాధ్యతలు మోయడం అంత తేలికేమీ కాదని ఈ మాజీ ఫాస్ట్బౌలర్ శ్రీశాంత్ పేర్కొన్నాడు. ఇప్పుడు.. నేను మాట్లాడే మాటలు వివాదానికి దారి తీసే ఛాన్స్ ఉంది అన్నాడు.
Read Also: Viral Video: ఓరి నాయనో.. ఏంది తల్లి ఈ విన్యాసాలు.. గుండె ఆగిపోయేలా ఉంది..
ఇక, జట్టు మొత్తం కలిస్తేనే కదా విజయాలు సాధించేది.. ఒకరిద్దరి గురించే ఎక్కువగా మాట్లాడుతారు అని కొందరు అంటున్నారు.. కానీ ధోని ఎప్పుడూ తాను లైమ్లైట్లోకి రావాలని కోరుకోలేదు అని శ్రీశాంత్ అన్నాడు. ఎల్లప్పుడూ జట్టునే ముందుంచే వాడు.. అంతేకాదు జట్టులో కొత్త ప్లేయర్స్ చేతికి ట్రోఫీని అందించే సంప్రదాయాన్ని కూడా ధోనినే స్టార్ట్ చేశాడు అని అతడు చెప్పుకొచ్చాడు. టీమ్ బాగుంటే చాలని భావించే వ్యక్తి ధోని.. మేము రెండుసార్లు వరల్డ్కప్ గెలవడంలో ప్రతి ఒక్క ఆటగాడి పాత్ర ఉందన్నాడు. ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ పై పరోక్షంగా శ్రీశాంత్ విమర్శలు గుప్పించాడు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!