గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించనందుకు జపాన్ పర్యాటకుడికి జరిమానా విధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పర్యాటకుడు హెల్మెట్ లేకుండా స్కూటర్ వెనుక సీటుపై కూర్చున్నాడు. పోలీసులు అతనికి జరిమానా విధించినప్పుడు వీడియో తీశాడు. సాధారణంగా, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న ప్రయాణీకుడు రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ చలాన్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ వైరల్ వీడియోలో, గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది జపాన్ పర్యాటకుడి నుండి రూ. 1000 తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. వీడియో వైరల్ అయిన వెంటనే, హైకమాండ్ ఈ విషయంలో చర్య తీసుకుంది. వీడియోలో కనిపించిన ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసింది.
Also Read:CM Chandrababu: ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యతపై సీఎం సమీక్ష.. కీలక సూచనలు
కార్డుతో డబ్బులు కడతామంటే, లేదు క్యాష్ కట్టండి లేదా కోర్టులో కట్టుకోండి అని చెప్పి రూ.1000 తీసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. వీడియో వైరల్ అవ్వడంతో లంచం తీసుకున్న ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఓ నెటిజన్ ఎక్స్ లో పోస్టు చేస్తూ.. గురుగ్రామ్ పోలీసులు జపాన్ పర్యాటకుడి నుండి లంచం తీసుకున్నారు. రసీదు ఇవ్వకుండా 1000 రూపాయలు తీసుకున్నారు. ఈ వ్యక్తులు భారత్ ప్రతిష్టను పాడు చేస్తున్నారు. వారికి జీతం సరిపోదా అని మండిపడ్డారు.
Gurugram police taking bribe from a Japanese tourist, taking 1000 rupees without giving the receipt, these people are ruining the image of India, why their salary is not enough for them@DC_Gurugram @gurgaonpolice @TrafficGGM @dtptraffic @DelhiPolice @PMOIndia @NayabSainiBJP pic.twitter.com/8myKwI43d2
— Kadwa h, lekin sach h (@sunny_panday_) September 1, 2025