Guntur TDP: గుంటూరు టీడీపీలో వర్గ విబేధాలు.. పీఎస్లో మహిళా కార్యకర్త ఫిర్యాదు!
- గుంటూరు టీడీపీలో వర్గ విబేధాలు
- ఎమ్మెల్యేను అడ్డుకున్న డివిజన్ నాయకులు
- పీఎస్లో మహిళా కార్యకర్త ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు తూర్పు నియోజక వర్గం, ఆర్టీసీ కాలనీలో టీడీపీలో బయటపడ్డ వర్గ విబేధాల ఘటనలో కేసు నమోదు అయింది. టీడీపీలోని ఒక వర్గం ఎమ్మెల్యేపై దాడి చేయడానికి ప్రయత్నం చేసిందని, తన మీద కూడా దాడికి వచ్చారని మహిళా కార్యకర్త మొవ్వ శైలజ పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగర ఉపాధ్యక్షుడు ఫిరోజ్తో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీడీపీలోని రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడంతో పాటు దాడి చేసుకునే యత్నం చేశారని ఫిర్యాదు అందిందని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని గుంటూరు పోలీసులు చెప్పారు. కాగా ఈ ఘటనపై టీడీపీలోని రెండు గ్రూపులు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసుకున్నట్లు తెలుస్తోంది. భగత్ సింగ్ జయంతి సందర్భంగా 1వ వార్డులో స్థానిక టీడీపీ మహిళా నేతలు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు. వార్డులో కార్యక్రమాలు నిర్వహించే సమయంలో స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యేను టీడీపీ డివిజన్ స్థాయి నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు, డివిజన్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Also Read
- Tags
- ap
- Guntur
- Guntur MLA
- guntur tdp
- tdp
తాజావార్తలు
-
China: “చైనా వృద్ధి 2 శాతం మాత్రమే” అన్న ఆర్థికవేత్త అనుమానాస్పద మృతి
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
-
Toxic: టాక్సిక్ అంతా ఇంతేనా?
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!