Guntur Police: కంతేరులో జరిగింది వ్యక్తిగత గొడవ.. రాజకీయ గొడవ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వాన్ని విమర్శించిన వెంకాయమ్మ కుటుంబంపై దాడి జరిగిందంటూ ఆరోపిస్తూ.. ఈ ఘటనకు నిరసనగా టీడీపీ ‘చలో కంతేరు’ పేరుతో ఆందోళనలు చేపట్టింది. అయితే టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని హౌస్ అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో కంతేరు ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. కంతేరులో సునీత, వంశీ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగిందని.. దీనిపై ఇద్దరూ ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశామని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ వెల్లడించారు. రెండు కేసుల్లో అరెస్టులు చేశామని.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
దర్యాప్తు జరుగుతున్నప్పుడు శాంతిభద్రతలు సమస్య తలెత్తేలా గ్రామానికి వెళ్తామని చెప్పడం కరెక్ట్ కాదని డీఐజీ త్రివిక్రమ వర్మ సూచించారు. వ్యక్తిగత గొడవలను రాజకీయ గొడవలుగా సృష్టిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. చలో కంతేరుకు పిలుపునివ్వడం మంచిది కాదని.. వెంకాయమ్మ ఇంటి వద్ద పికెట్ పెట్టామని తెలిపారు. దుర్గి మండలంలో ఒక హత్య జరిగిందని.. వెంటనే ఆ హత్య కేసులో అరెస్టులు చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ నేతల బానిసలు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారని.. అన్ని రాజకీయ పార్టీలు తమకు సమానమే అని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర 150 మందితో సెక్యూరిటీ ఇస్తున్నామని.. మరి వాళ్ళు కూడా బానిసలేనా అని నిలదీశారు. పోలీసులపై అనవసరమైన కామెంట్స్ చేసి తమ మనోభావాలు దెబ్బతీయవద్దన్నారు.
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
కంతేరులో గొడవ వ్యక్తిగత గొడవ అని.. రాజకీయ గొడవ కాదని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ కామెంట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత గొడవలను రాజకీయం చేయడం మంచిది కాదని సూచించారు. దీని వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని.. ఈ గొడవకు సంబంధించి సీసీ కెమెరాల విజువల్స్ కూడా ఉన్నాయని ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ తెలిపారు.
Telugu Desam Party: టీడీపీ ఆధ్వర్యంలో ‘ఛలో కంతేరు’.. మాజీ మంత్రి హౌస్ అరెస్ట్
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!