Gunmen Attacks: నరమేధం.. మార్కెట్లోకి ప్రవేశించి 47 మందిని కాల్చి చంపిన సాయుధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunmen Attack: ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు రెచ్చిపోయారు. రెండు సార్లు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో సహా 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర-మధ్య నైజీరియా బెన్యూ రాష్ట్రంలోని ఉమోగిడి గ్రామంలో మార్కెట్ ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డారు. మంగళవారం సాయుధులు విచక్షణ రహితంగా కాల్పులు జరపగా.. ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. బుధవారం అదే ప్రాంతంలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. ఈ కాల్పుల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. అయితే, ఈ దాడుల వెనుక ఉన్న ఉద్దేశం తెలియలేదు. కానీ ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరూ ఈ దాడులకు బాధ్యత వహించలేదని తెలిపారు.
అయితే, ఈ ప్రాంతంలో రైతులు, స్థానిక పశువుల కాపరుల మధ్య గొడవలు జరుగుతున్నాయని వెల్లడించారు. స్థానిక పశువుల కాపరులే ఈ దాడులకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నాడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 47 మందిని కాల్చి చంపినట్లు ఒటుక్పో స్థానిక ప్రభుత్వ చైర్మన్ తెలిపారు. ఈ ఘటనకు ఒక రోజు ముందు, అదే స్థలంలో ముగ్గురు దారుణంగా హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు. బెన్యూ స్టేట్ పోలీసులతో అనెన్ సీవీస్ ఈ దాడిని ధృవీకరించారు. దుండగులు అకస్మాత్తుగా మార్కెట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని, ఈ దాడిలో ఒక పోలీసు అధికారి కూడా మరణించినట్లు సీవీస్ తెలిపారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
నైజీరియోలోని బెన్యూ రాష్ట్రాన్ని అక్కడి ప్రజలు ‘నైజీరియా ఫుడ్ బాస్కెట్ ‘గా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఇక్కడ సమృద్ధిగా పంటలు పండతాయి. అయితే, కాపరులు తమ పొలాల్లో పశువులు మేపుతూ పంటలు నాశనం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1965లో తొలిసారిగా చట్టం ద్వారా ఆ భూములన్నీ తమకు చెందుతాయని పశువుల కాపరులు నొక్కి చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తరచూ జరిగే ఈ ఘర్షణల వల్ల రాష్ట్రం నుంచి వ్యవసాయ దిగుబడులు తగ్గిపోయాయి. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలను ఈ పరిస్థితి మరింత కుంగదీస్తోంది.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!