Gun Firing: అహోబిలంలో నాటు తుపాకీ కాల్పుల కలకలం

Gun Firing

Gun Firing

Gun Firing: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో నాటు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలే ఈ కాల్పులకు కారణమైనట్లు తెలిసింది. పని కోసం అడవిలోకి వెళ్లిన నరసింహను కాల్చేందుకు రామాంజనేయులు అనే వ్యక్తి నాటు తుపాకిని పేల్చారు. నరసింహ పక్కకు తప్పుకోవడంతో అతని వెంట వెళ్లిన పెద్దన్నకు బుల్లెట్ తగిలి గాయాలయ్యాయి.

Also Read: Chinta Mohan: చంద్రబాబు చాలా మంచివాడు.. తక్షణమే విడుదల చేయాలి..!

×
×
Ad

అహోబిలం చెంచు కాలనీకి చెందిన నరసింహ, రామాంజనేయులుకు చాలా కాలంగా మనస్పర్ధలు ఉన్నట్లు తెలిసింది. గాయపడిన పెద్దన్నను ఆసుపత్రికి స్థానికులు తరలించారు. కాల్పులు జరిపిన రామాంజనేయులు, గాయపడిన పెద్దన్న, నరసింహులు చెంచు కాలనీకి చెందిన వారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.