అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం దిగువగొట్టివీడులో కాల్పుల కలకలం సంచలనం రేపుతుంది. పుల్లగూర శ్రీరాములు అనే వ్యక్తిపై గురిజాల పాపారావు అనే వ్యక్తి నాటు తుఫాకితో కాల్పులు జరిపినట్లు ఆరోపించారు. కాల్పుల్లో గాయపడ్డ పుల్లగూర శ్రీరాములు.. ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.. భూ వివాదమే ఇందుకు కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. దీంతో గ్రామస్తులు పిస్తోల్ ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.
Read Also: Madhya Pradesh: మహిళలు తమ భర్తల్ని ఇంట్లోకే మద్యం తెచ్చుకోని తాగమనండి.. మంత్రి సలహా..
అయితే, చిన్నమండెం మండలం దిగువగొట్టివీడులో జరిగిన తుఫాకీ కలకలంపై రాయచోటి రూరల్ పోలీసులు స్పందించారు. నిందితుడు పాపారావు వాడినది రియల్ పిస్టల్ కాదని పోలీసు నిపుణులు తేల్చారు. ఎయిర్ గన్ తో శ్రీరాములు తలపై పాపారావు కొట్టినట్లు తెలిపారు. ఎయిర్ గన్ తో ప్రత్యర్దులను భయబ్రాంతులకు గురి చేసినట్లు చెప్పుకొచ్చారు. భూవివాదంలో పాపారావు, శ్రీరాములు మద్య విభేదాలు ఉన్నాయి.. శుక్రవారం రాత్రి జరిగిన సంఘటన.. పాపారావు దగ్గర ఉన్న సక్రమంగా పని చేయని ఎయిర్ గన్ తో శ్రీరాములు తలపై కొట్టడంతో గాయాలు అయ్యాని పోలీసులు పేర్కొన్నారు. ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్ గన్ స్వాదీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయచోటి రూరల్ సీఐ తులసీ రామ్ విచారిస్తున్నామన్నారు.