NTV Telugu Site icon

Gujarat: క్రికెట్ మ్యాచ్‌లో ఘర్షణ.. యువకుడి హత్య

Match

Match

క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని చిఖోద్రాలో చోటుచేసుకుంది. ఇరవై మూడేళ్ల సల్మాన్ వోహ్రా జూన్ 22న గుజరాత్‌లోని చిఖోద్రాలో క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ చూడటానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఇరువర్గాల టీమ్‌ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక పార్కింగ్ స్థలం దగ్గర మద్యం మత్తులో ఉన్న కొందరు సల్మాన్‌తో ఘర్షణకు దిగారు. ఈ గొడవలో క్రికెట్ బ్యాట్‌లతో దాడి చేయడంతో సల్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.

ఇది కూడా చదవండి: UPSC: సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల

కొంతమంది సల్మాన్‌ను ఎత్తుకుని నీరు తాగించి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ అక్కడికి చేరుకోగానే పెద్ద ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. అయితే రెండో ఆసుపత్రికి చేరుకుని డాక్టర్‌తో మాట్లాడిన తరుణంలో సల్మాన్ ప్రాణాలు విడిచాడు.

ఇది కూడా చదవండి: Foods: ఖాళీకడుపుతో ఈ ఆహార పదార్థాలు అస్సలు తినొద్దు..

సల్మాన్ మామ నోమన్ అన్వర్ వోహ్రా మాట్లాడుతూ… రెండు నెలల క్రితమే వివాహం అయిందని తెలిపాడు. అతని భార్య మషీరా కూడా కొన్ని వారాల క్రితమే గర్భవతి అయిందని సల్మాన్ మామ చెప్పారు. టోర్నమెంట్‌లో మతపరమైన తారతమ్యం ఏర్పడడంతోనే ఈ ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురి నిందితుల్ని అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: SVC 58 : వైరటీ పోస్టర్ తో వెంకటేష్, అనిల్ రావిపూడి చిత్రం అనౌన్స్మెంట్..