Viral Video : లక్ష మందిని పిలిచి, విందు పెట్టి చాలా గ్రాండ్ గా కారును సమాధి చేసిన రైతు కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video : మన జీవితంలో ఉపయోగించిన కారు, ఫోన్, ల్యాప్టాప్ వంటి వాటిని కొంత కాలం తర్వాత చెత్తకుప్పల్లో పడేస్తాం కానీ గుజరాత్లోని అమ్రేలి జిల్లాలోని ఓ గ్రామంలో ఇలాంటి దృశ్యం కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ గ్రామానికి చెందిన ఒక కుటుంబం వారి అదృష్ట కారుని దాని సమయం ముగిసినప్పుడు పూర్తి ఆచారాలతో ఖననం చేసింది. కారు పట్ల కుటుంబ సభ్యుల భావాలు ఎంత గాఢంగా ఉన్నాయంటే ఆ కారును ఎప్పటికీ గుర్తుంచుకునేలా గ్రాండ్గా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంత్యక్రియలకు ముందు కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. పూలతో అలంకరించి, దాని పైభాగంలో కొబ్బరికాయను ఉంచి, దానిపై ఆకుపచ్చ కవర్ వేసి, పూజలు నిర్వహించి, అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య కుటుంబ సభ్యులు కారుకు వీడ్కోలు పలికారు. అలాగే అంత్యక్రియలకు మొత్తం రూ.5 లక్షలు ఖర్చు చేశారు.
కార్యక్రమంలో స్థానిక సాధువులు, మత పెద్దల సమక్షంలో గ్రామంలోని సుమారు 1500 మందికి అన్నదానం చేశారు. ఈ విశిష్ట కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వాన పత్రికను ప్రజలకు పంపారు. అందులో ‘‘ఈ కారు మా కుటుంబంలో సభ్యురాలిగా మారిందని, మాకు ఎంతో అదృష్టమని లేఖలో రాశారు. మేము దానిని ఎల్లప్పుడూ మా జ్ఞాపకాలలో ఉంచాలనుకుంటున్నాము, కాబట్టి మేము దానిని గౌరవప్రదంగా సమాధి చేస్తున్నాము.’’ అని రాసుకొచ్చారు.
Also Read
Read Also:Vizag Crime: రూ.6 కోట్లు ఖర్చు చేసి పెళ్లి.. అదనపు కట్నం కోసం వేధింపులు..! వివాహిత ఆత్మహత్య..
Gujarat: In Amreli, farmer Sanjay Polra gave his 15-year-old car a symbolic "final resting place" in gratitude for the prosperity it brought his family. The family held a ceremony with the village, planting trees at the site to commemorate their fortune-changing vehicle pic.twitter.com/vtoEkVQLIP
— IANS (@ians_india) November 8, 2024
గుజరాత్లోని లాఠీ తాలూకా పదర్శింగ గ్రామానికి చెందిన సంజయ్ పొల్లారా అనే రైతు 2006లో ఈ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు తన కుటుంబానికి అదృష్టమని చెప్పారు. ఈ కారు వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా సమాజంలో గౌరవం పెరిగిందని సంజయ్ చెప్పారు. ఈ కారు తమ జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చిందని కుటుంబ సభ్యులు భావించారు, కాబట్టి వారు దీనికి ప్రత్యేక గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు తమ దేవతలకు పూజలు చేసి, పూలతో అలంకరించిన కారును ఊరేగింపుగా తమ పొలంలో ఉన్న సమాధి స్థలానికి తీసుకెళ్లారు. సమాధి సమయంలో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ఆ సమయంలో ఉద్వేగానికి లోనైనట్లు సంజయ్ పొల్లారా తెలిపారు. “మేము దీనిని ఒక ప్రత్యేక పద్ధతిలో గౌరవించాలని భావించాము. మేము సమాధిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాము,” అని అతను చెప్పాడు. ప్రతి సంవత్సరం నవంబర్ 7న ఈ సమాధి వద్ద పూలు సమర్పించి చుట్టూ చెట్లను నాటాలని కూడా పొల్లారా నిర్ణయించారు. గ్రామానికి చెందిన విపుల్ సోజిత్రా మాట్లాడుతూ, “కార్కు సమాధి ఇస్తున్నారని విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను, కాని కుటుంబం తమ లక్కీ కారు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నట్లు ఇప్పుడు నాకు అర్థమైంది” అని అన్నారు.
Read Also:Health Tips: పరగడుపున నిమ్మరసం తేనె తాగేవారికి సూపర్ టిప్..
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?