GST Rule Change: వచ్చే నెలనుంచి మారనన్న జీఎస్టీ రూల్.. వ్యాపారులకు తిప్పలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Rule Change: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో వచ్చే నెల నుంచి లావాదేవీలకు సంబంధించిన నియమాలలో మార్పులు చేయబడ్డాయి. పన్ను చట్టాలను ప్రభావవంతంగా చేయడానికి, సమ్మతిని సులభతరం చేయడానికి, చివరికి పన్ను ఎగవేతను నిరోధించడానికి జీఎస్టీలో కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. జీఎస్టీ నెట్వర్క్ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. కొత్త నిబంధనను మే 1, 2023 నుండి వ్యాపారవేత్తలు తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం ఉంది. మే 1 నుండి ఏదైనా లావాదేవీకి సంబంధించిన రసీదును 7 రోజుల్లోగా ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (IRP)లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Read Also: Prakash Ambedkar : దేశంలో కొత్త నడవడికను సీఎం కేసీఆర్ మొదలుపెట్టారు
Also Read
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
GSTN ప్రకారం.. మే 1 నుండి 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారవేత్తలందరూ ఈ నియమాన్ని పాటించాలి. కొత్త నిబంధన ప్రకారం, 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు పాత ఇన్వాయిస్లను అప్లోడ్ చేయలేరు. అందుకు కొంత సమయం విధించబడుతుంది. IRPలో ఇన్వాయిస్ అప్లోడ్ చేయకపోతే వ్యాపారులు దానిపై ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ప్రయోజనాన్ని పొందలేరు అని GST నియమాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపెనీలు తమ ఇ-ఇన్వాయిస్లను ఎప్పుడైనా అప్లోడ్ చేయవచ్చు.. కానీ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ సమయం కేవలం 7 రోజులు మాత్రమే ఉంటుంది.
Read Also:Chewing Gum : ఏడాదికి లక్ష టన్నుల చూయింగ్ గమ్ నమిలేస్తున్నారా ?
జీఎస్టీ వసూళ్లను పెంచేందుకు కొత్త రూల్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు . దీనితో పాటు కంపెనీలు సమయానికి ITC యొక్క ప్రయోజనాన్ని కూడా పొందుతాయి. డిజిటలైజేషన్ ప్రక్రియను బలోపేతం చేయడమే దీని ఉద్దేశం. ఇటీవల, 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు లేదా కంపెనీలు ప్రతి లావాదేవీకి GST ఇన్వాయిస్ను రూపొందించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ ప్రక్రియ నిదానంగా అమలవుతుందని.. త్వరలో వ్యాపారులందరికీ దీన్ని తప్పనిసరి చేస్తామని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం, 10 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు అన్ని B2B లావాదేవీలకు ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లను రూపొందించడం తప్పనిసరి చేయబడింది. ప్రభుత్వం అక్టోబర్ 1, 2022 నుండి ఈ నియమాన్ని అమలు చేసింది. ఇప్పుడు IRPలో ఇ-ఇన్వాయిస్లను సకాలంలో అప్లోడ్ చేయడం ద్వారా ప్రభుత్వం, కంపెనీలు రెండూ ప్రయోజనం పొందుతాయి. ఒకవైపు, ఇది GST వసూళ్లను పెంచడంలో సహాయపడుతుంది. మరోవైపు వ్యాపారులు ITC ప్రయోజనాన్ని త్వరగా పొందగలుగుతారు.
తాజావార్తలు
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?