Online Games: ఇక ఫోన్లో గేమ్స్ ఆడాలన్నా పన్ను కట్టాల్సిందే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Games : ఆన్లైన్ గేమింగ్ ఆడే వారికి పెద్ద షాక్. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాల(జూదం)పై జీఎస్టీని భారీగా పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు వాటిపై 18 శాతం జీఎస్టీ ఉండగా.. దానిని 28 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రుల ప్యానెల్ ప్రతిపాదనను మే లేదా జూన్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే నైపుణ్యతను పెంచే గేములపై జీఎస్టీ 18శాతంగా ఉండనుంది. ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్పై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ఇది ఆన్లైన్ గేమింగ్ పోర్టల్ ద్వారా వసూలు చేయబడిన మొత్తం రుసుముపై ఉంటుంది.
Read Also: Heavy Rains: హైదరాబాద్లో భారీ వర్షాలు.. వడగళ్ల వానలు కురిసే అవకాశం
Also Read
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
గతంలోనే మేఘాలయ సీఎం సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందం, గేమ్లో పాల్గొనడానికి ఆటగాడు చెల్లించే ప్రవేశ రుసుముతో సహా, ఆన్లైన్ గేమింగ్ పూర్తి విలువతో పన్ను విధించాలని సిఫార్సు చేసింది.. క్యాసినో, ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందాలపై 28 శాతం జీఎస్టీ విధించాలని సూచనలు చేసింది. రేస్ కోర్సుల విషయంలో, టోటలైసేటర్లలో పూల్ చేసి బుక్మేకర్ల వద్ద ఉంచిన బెట్టింగ్ల పూర్తి విలువపై జీఎస్టీ విధించాలని.. కాసినోలో ఒక ఆటగాడు కాసినో నుండి కొనుగోలు చేసిన నాణేల పూర్తి విలువపై పన్ను విధించాలని సిఫార్సు చేసింది మంత్రుల కమిటీ… మునుపటి రౌండ్లలో గెలిచిన వాటితో సహా, ప్రతి రౌండ్ బెట్టింగ్లో ఉంచిన బెట్టింగ్ల విలువపై జీఎస్టీ వర్తింపజేయాలని ప్రతినాదలను పంపారు.. అలాగే, కాసినోలలోకి ప్రవేశ రుసుములపై 28 శాతం వస్తువులు మరియు సేవల పన్ను విధించాలని, ఇందులో తప్పనిసరిగా ఆహారాలు/పానీయాలు మొదలైనవాటిని చేర్చాలని జీఎంవో సూచించింది.
Read Also:Manipur : సీఎం కార్యక్రమంలో గందరగోళం..వేదికకు నిప్పుపెట్టిన దుండగులు
రెండేళ్లలో 29,000 కోట్ల పరిశ్రమ
KPMG నివేదిక ప్రకారం, కరోనా లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ గేమింగ్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నివేదిక ప్రకారం, వచ్చే రెండేళ్లలో అంటే 2024-25 నాటికి దేశీయ ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ పరిమాణం రూ.29,000 కోట్లకు పెరగనుంది. 2021లో ఇది 13,600 కోట్లు.
తాజావార్తలు
-
Narendra Modi: ‘జవహర్ లాల్ నెహ్రూ’ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
-
Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
-
TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
-
Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు ‘భారతీరాజా’
-
Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి