Manipur : సీఎం కార్యక్రమంలో గందరగోళం..వేదికకు నిప్పుపెట్టిన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur : మణిపూర్ రాష్ట్రంలో సీఎం పాల్గొనున్న కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఓ మూక సీఎం ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం పాల్గొనబోయే కార్యక్రమ వేదికకు నిప్పు పెట్టింది. ఈ ఘటన గురువారం రాత్రి చురచాంద్పూర్ జిల్లాలోని న్యూ లంకాలో జరిగింది. శుక్రవారం ఆ వేదిక పై సీఎం ఎన్ బీరెన్ సింగ్ కూర్చోవాల్సి ఉంది. గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రే దానికి నిప్పు పెట్టారు. దాంతో పాటు అక్కడే సీఎం బీరెన్ సింగ్ ప్రారంభించడాదనికి రెడీగా ఉన్న ఓపెన్ జిమ్నూ ఆ మూక ధ్వంసం చేసింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే కార్యరంగంలోకి దిగారు. ఆ మూకను చూసిన పోలీసులు వారిని చెదరగొట్టారు. వేదికతోపాటు వందలాది కుర్చీలు ధ్వంసం అయ్యాయి.
Read Also:RR vs CSK : చెన్నైపై రాజస్థాన్ గెలుపు.. 32 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
సీఎం బీరెన్ సింగ్ న్యూ లంకాలోని పీటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ ఓపెన్ జిమ్ను శుక్రవారం ప్రారంభించాల్సింది. కానీ, ఆ ఓపెన్ జిమ్ను మూక నిప్పు పెట్టి పాక్షికంగా ధ్వంసం చేసింది. ఈ జిమ్ ఓపెనింగ్తోపాటు స్థానిక సద్బావన మండప్ నిర్వహించే ఓ పంక్షన్కూ సీఎం రేపు వెళ్లాల్సిన షెడ్యూల్ ఉన్నది. ముందుగా, ఇండిజీనస్ ట్రైబ్ లీడర్స్ ఫోరమ్ చురచాంద్పూర్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యం లోనే మూక ఈ దాడికి పాల్పడింది. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా నుంచి రైతులను, ఇతర గిరిజనులను బయటకు పంపే కార్యక్రమాన్ని నిరసిస్తూ తాము ప్రభుత్వా నికి ఎన్నో మెమోరాండంలు అందించామని ఆ ఫోరమ్ చెప్పింది. కానీ, ప్రభుత్వం మాత్రం అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలకించడానికీ అయిష్టత చూపెట్టిందని వివరించింది. అందుకే సీఎం పర్యటన నేపథ్యంలో చురచాంద్పూర్ బంద్కు పిలుపు ఇచ్చింది.
Read Also:Off The Record: సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి కుమారుడు..? బీఆర్ఎస్లో టిక్కెట్ పంచాయతీ..?
తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!