GST Collection: కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం.. ఎంతో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో జీఎస్టీ వసూళ్ల సంఖ్యలు నెల నెలకు పెరుగుతూ వస్తున్నాయి. జీఎస్టీ వల్ల ప్రభుత్వాలకు భారీ ఆదాయం చేకూరుతుంది. జూలై నెలలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 1.65 ట్రిలియన్ల జీఎస్టీ వసూలు చేశాయి. ఇది గతేడాది కంటే 11 శాతం ఎక్కువ. అంతేకాకుండా జీఎస్టీ ఆదాయం 1.6 ట్రిలియన్లకు పైగా రావడం ఇది ఐదోసారి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఏప్రిల్లో 1.87 ట్రిలియన్ల రికార్డు కలెక్షన్ తర్వాత.. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఇదే అత్యధిక ఆదాయ సేకరణగా అధికారులు చెబుతున్నారు.
Hyderabad Metro: ఓల్డ్ సిటీలో కొన్ని కారణాలతో మెట్రో నిర్మాణం మరింత ఆలస్యం
Also Read
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) నుంచి రూ.41,239 కోట్లు, దిగుమతులపై జీఎస్టీ సెస్ ద్వారా రూ.840 కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది. అంతర్రాష్ట్ర విక్రయాల సెటిల్మెంట్ తర్వాత జూలైలో కేంద్రం రూ.69,558 కోట్లు, రాష్ట్రాలు రూ.70,811 కోట్లు జీఎస్టీ ఆదాయంలో తమ వాటాగా వసూలు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. జూలైలో దేశీయ లావాదేవీల (సేవల దిగుమతి) ఆదాయం గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుంచి వచ్చిన ఆదాయం కంటే 15 శాతం ఎక్కువ అని ప్రకటన పేర్కొంది.
Minister Kottu Satyanarayana: పవన్ కళ్యాణ్ చంద్రబాబు విష కౌగిలిలో చిక్కుకుపోయారు..
పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలు రెండంకెల ఆదాయాన్ని వసూలు చేశాయి. జూలైలో ఢిల్లీ జీఎస్టీ ఆదాయంలో 25 శాతం వృద్ధితో రూ.5,405 కోట్లకు చేరుకోగా.. ఉత్తరప్రదేశ్ ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.8,802 కోట్లకు చేరుకుంది. కాగా, మహారాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో 18 శాతం వృద్ధితో రూ.26,024 కోట్లకు చేరుకుంది. కర్ణాటక జీఎస్టీ వసూళ్లలో 17 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.11,505 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. తమిళనాడు జూలైలో రూ.10,022 కోట్ల జీఎస్టీ రాబడిని వసూలు చేసింది. ఇందులో 19 శాతం మెరుగుదల కనిపించింది. మరోవైపు జూలైలో గుజరాత్లో కేవలం 7 శాతం ఆదాయం మాత్రమే పెరిగింది.
తాజావార్తలు
-
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
-
Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
-
Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
-
Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్పై బుచ్చిబాబు ఎమోషనల్!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!