GST Collection: కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం.. ఎంతో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో జీఎస్టీ వసూళ్ల సంఖ్యలు నెల నెలకు పెరుగుతూ వస్తున్నాయి. జీఎస్టీ వల్ల ప్రభుత్వాలకు భారీ ఆదాయం చేకూరుతుంది. జూలై నెలలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 1.65 ట్రిలియన్ల జీఎస్టీ వసూలు చేశాయి. ఇది గతేడాది కంటే 11 శాతం ఎక్కువ. అంతేకాకుండా జీఎస్టీ ఆదాయం 1.6 ట్రిలియన్లకు పైగా రావడం ఇది ఐదోసారి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఏప్రిల్లో 1.87 ట్రిలియన్ల రికార్డు కలెక్షన్ తర్వాత.. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఇదే అత్యధిక ఆదాయ సేకరణగా అధికారులు చెబుతున్నారు.
Hyderabad Metro: ఓల్డ్ సిటీలో కొన్ని కారణాలతో మెట్రో నిర్మాణం మరింత ఆలస్యం
Also Read
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) నుంచి రూ.41,239 కోట్లు, దిగుమతులపై జీఎస్టీ సెస్ ద్వారా రూ.840 కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది. అంతర్రాష్ట్ర విక్రయాల సెటిల్మెంట్ తర్వాత జూలైలో కేంద్రం రూ.69,558 కోట్లు, రాష్ట్రాలు రూ.70,811 కోట్లు జీఎస్టీ ఆదాయంలో తమ వాటాగా వసూలు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. జూలైలో దేశీయ లావాదేవీల (సేవల దిగుమతి) ఆదాయం గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుంచి వచ్చిన ఆదాయం కంటే 15 శాతం ఎక్కువ అని ప్రకటన పేర్కొంది.
Minister Kottu Satyanarayana: పవన్ కళ్యాణ్ చంద్రబాబు విష కౌగిలిలో చిక్కుకుపోయారు..
పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలు రెండంకెల ఆదాయాన్ని వసూలు చేశాయి. జూలైలో ఢిల్లీ జీఎస్టీ ఆదాయంలో 25 శాతం వృద్ధితో రూ.5,405 కోట్లకు చేరుకోగా.. ఉత్తరప్రదేశ్ ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.8,802 కోట్లకు చేరుకుంది. కాగా, మహారాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో 18 శాతం వృద్ధితో రూ.26,024 కోట్లకు చేరుకుంది. కర్ణాటక జీఎస్టీ వసూళ్లలో 17 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.11,505 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. తమిళనాడు జూలైలో రూ.10,022 కోట్ల జీఎస్టీ రాబడిని వసూలు చేసింది. ఇందులో 19 శాతం మెరుగుదల కనిపించింది. మరోవైపు జూలైలో గుజరాత్లో కేవలం 7 శాతం ఆదాయం మాత్రమే పెరిగింది.
తాజావార్తలు
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..