GST Collection: కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం.. ఎంతో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో జీఎస్టీ వసూళ్ల సంఖ్యలు నెల నెలకు పెరుగుతూ వస్తున్నాయి. జీఎస్టీ వల్ల ప్రభుత్వాలకు భారీ ఆదాయం చేకూరుతుంది. జూలై నెలలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 1.65 ట్రిలియన్ల జీఎస్టీ వసూలు చేశాయి. ఇది గతేడాది కంటే 11 శాతం ఎక్కువ. అంతేకాకుండా జీఎస్టీ ఆదాయం 1.6 ట్రిలియన్లకు పైగా రావడం ఇది ఐదోసారి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఏప్రిల్లో 1.87 ట్రిలియన్ల రికార్డు కలెక్షన్ తర్వాత.. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఇదే అత్యధిక ఆదాయ సేకరణగా అధికారులు చెబుతున్నారు.
Hyderabad Metro: ఓల్డ్ సిటీలో కొన్ని కారణాలతో మెట్రో నిర్మాణం మరింత ఆలస్యం
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) నుంచి రూ.41,239 కోట్లు, దిగుమతులపై జీఎస్టీ సెస్ ద్వారా రూ.840 కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది. అంతర్రాష్ట్ర విక్రయాల సెటిల్మెంట్ తర్వాత జూలైలో కేంద్రం రూ.69,558 కోట్లు, రాష్ట్రాలు రూ.70,811 కోట్లు జీఎస్టీ ఆదాయంలో తమ వాటాగా వసూలు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. జూలైలో దేశీయ లావాదేవీల (సేవల దిగుమతి) ఆదాయం గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుంచి వచ్చిన ఆదాయం కంటే 15 శాతం ఎక్కువ అని ప్రకటన పేర్కొంది.
Minister Kottu Satyanarayana: పవన్ కళ్యాణ్ చంద్రబాబు విష కౌగిలిలో చిక్కుకుపోయారు..
పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలు రెండంకెల ఆదాయాన్ని వసూలు చేశాయి. జూలైలో ఢిల్లీ జీఎస్టీ ఆదాయంలో 25 శాతం వృద్ధితో రూ.5,405 కోట్లకు చేరుకోగా.. ఉత్తరప్రదేశ్ ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.8,802 కోట్లకు చేరుకుంది. కాగా, మహారాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో 18 శాతం వృద్ధితో రూ.26,024 కోట్లకు చేరుకుంది. కర్ణాటక జీఎస్టీ వసూళ్లలో 17 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.11,505 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. తమిళనాడు జూలైలో రూ.10,022 కోట్ల జీఎస్టీ రాబడిని వసూలు చేసింది. ఇందులో 19 శాతం మెరుగుదల కనిపించింది. మరోవైపు జూలైలో గుజరాత్లో కేవలం 7 శాతం ఆదాయం మాత్రమే పెరిగింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!