Group -1 Rankers’ Parents: కూటికి గతిలేని మేము రూ.3 కోట్లు పెట్టి పోస్ట్ ఎలా కొంటాం సారూ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group -1 Rankers’ Parents: గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారందరికీ జవాబు చెబుతామంటూ మీడియా సమావేశం నిర్వహించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత మొదటిసారి స్పందించారు. ఈ సందర్భంగా పలువురు పేరెంట్స్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పిల్లలు కష్టపడి సాధించిన విజయాన్ని అపహాస్యం చేసే అసత్య ఆరోపణలపై బాధను వ్యక్తం చేయడానికి మీడియా ముందుకు వచ్చామన్నారు.. కేవలం కృషి, ప్రతిభతో విజయం సాధించిన తమ పిల్లల గౌరవాన్ని దెబ్బతీసిన నిరాధారణమైన ఆరోపణలపై మనోవేదనను వ్యక్తం చేశారు.
READ MORE: Diarrhea Cases: విజయవాడలో తగ్గని డయేరియా కేసులు.. ఇప్పటికే 380కి పైగా..!
Also Read
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
గ్రూప్-1 పోస్టులు రూ. 3 కోట్లకు అమ్ముకుంటున్నారని కేటీఆర్ ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఓ గ్రూప్-1 ర్యాంకర్ పేరెంట్ మాట్లాడారు. “గ్రూప్-1 పోస్టును రూ. 3 కోట్లుకు కొన్నారని మాపై ఆరోపణలు చేశారు. మూడు కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా మాకు తెలియదు. మూడు కోట్లు ఇచ్చి ఉద్యోగం చేయాల్సిన అవసరం మాకు ఏముంది. ఏదో వ్యాపారం చేసుకుని బతకగలుగుతాం. మీమందరం మూడు కోట్ల లంచం ఇచ్చే పరిస్థితిలో ఉన్నామా..? ఒక్కసారి మమ్మల్ని చూసి ఆలోచించండి. మా పిల్లలకు న్యాయం చేయండి. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని హైకోర్టును కూడా విన్నవించుకుంటున్నాం.” అని ఆవేదన వ్యక్తం చేశారు.
READ MORE: Diarrhea Cases: విజయవాడలో తగ్గని డయేరియా కేసులు.. ఇప్పటికే 380కి పైగా..!
“గ్రూప్ 1 ఫలితాలపై ఒక్కొకరు ఒక్కోలా మాట్లాడుతున్నారు.. ఒక్కో పేరెంట్ 3 కోట్ల రూపాయలు పెట్టి పోస్ట్ లు కొన్నారు అని ఆరోపిస్తున్నారు.. మాలో కొందరికి కూటికి కూడా గతి లేదు.. కష్టపడి.. పస్తులుండి.. అప్పులు చేసి పిల్లలను చదివించాం.. సమాజం మా పట్ల చిన్న చూపు చూసే అవకాశం ఉంది.. ఆరోపణలు తిప్పికొట్టకపోతే నిజంగానే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం అని మీడియా ముందుకు వచ్చాం. రేపు మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా.. 3 కోట్లు పెట్టి కొనుక్కున్న ఉద్యోగం అనే నలుగురూ అనుకునే అవకాశం ఉంది.. మీ రాజకీయాలు మీ మధ్యే ఉంచుకోండి.. మీ ఆరోపణలు, ప్రత్యారోపణలు.. నిరుద్యోగులపై రుద్దకండి. దుష్ప్రచారం చేసి.. నిరుద్యోగులను చిన్నచూపు చూసే ఆరోపణలు చేయకండి.. మీరు చేస్తున్న ఆరోపణలు నిరూపించండి.. వాస్తవాలను బయటపెట్టండి.. రాజకీయాలు చేసి.. మా పిల్లల జీవితాలు నాశనం చేయకండి..” అని మరో పేరెంట్ వాపోయారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..